అన్వేషించండి

Gudivada News : మంత్రి కొడాలి నాని-వంగవీటి రాధా భేటీ, ఏం మాట్లాడుకున్నారో అని ఆసక్తికర చర్చ!

Gudivada News : మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా ఎప్పుడు భేటీ అయినా సంచలనమవుతుంది. తాజాగా వీరిద్దరూ గుడివాడలో కలిశారు. దీంతో మళ్లీ రాధా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Gudivada News : ఒకరు అధికార పార్టీ, మరొకరు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసినా స్టేట్ మొత్తం మాట్లాడుకుంటుంది. ఇద్దరూ వారి సామాజిక వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలు.  రాష్ట్ర మంత్రి కొడాలి నాని(Kodali Nani), టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా(Vangaveeti Radha) కలిశారు. వైసీపీ(Ysrcp) నేత, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ బాబ్జీ అంతిమ యాత్రలో శనివారం పాల్గొన్న ఇరువురు గుడివాడ(Gudivada)లో కలిశారు. అంతిమ యాత్ర సమయంలో ఓ ఆటోలో కాసేపు కూర్చొని సేదతీరారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో వంగవీటి రాధా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

వైసీపీలో ఆహ్వానం 

గతంలోనూ కొడాలి నాని, వంగవీటి రాధా పలు మార్లు భేటీ అయ్యారు. వంగవీటి రాధాను వైసీపీలోకి రావాలని మంత్రి కొడాలి నాని గతంలో ఆహ్వానించారు. కానీ వంగవీటి రాధా మంత్రి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వంగవీటి రాధా తన హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారన్నారు. ఈ సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా పలు పార్టీల నేతలు రాధాను పరామర్శించారు. తాను పార్టీ మారడం లేదని రాధా అప్పుడు ఆ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. అయినా మరోసారి మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా భేటీ అవ్వడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.  

కాపు నేతలతో రాధా భేటీ

కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధా తన హత్యకు రెక్కీ నిర్వహించారని మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ సమక్షంలో వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పోలీసు విచారణ, ప్రభుత్వం గన్ మెన్ల ఏర్పాటుతో వివాదం సద్దుమణిగింది. కొడాలి నాని, వంశీ, రాధా అప్పుడప్పుడూ సమావేశం అవుతున్నారు. గతంలోనూ రాధా పలుమార్లు గుడివాడకు వెళ్లి అక్కడ మంత్రి కొడాలి నానితో సమావేశం అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వంగవీటి రాధా గుడివాడలో కాపు నేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణకు రాధా హాజరవుతున్నారు. అయితే గుడివాడలో రాధా పర్యటన సమయంలో ఎక్కువగా వైసీపీకి చెందిన కాపు నేతలు ఉండడంతో జోరుగా ప్రచారం జరుగుతుంది. 

Also Read : Gannavaram YSRCP: వల్లభనేనికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డికి లేఖ! YSRCPలో లుకలుకలు - ఇందులో నిజమెంత?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget