అన్వేషించండి

AP new districts update: ఏపీలో కొత్త జిల్లాలు, సరిహద్దుల మార్పుపై కసరత్తు వేగం - అసెంబ్లీ సమావేశాల నాటికే నిర్ణయాలు ?

Andhra : ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలపై అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తేల్చే అవకాశం ఉంది. మంత్రుల సబ్ కమిటీ ఈ మేరకు తుది కసరత్తు చేయనుంది.

Andhra Pradesh new districts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల సరిహద్దుల మార్పు, మండలాలు, గ్రామాల సర్దుబాట్లు, పేర్ల మార్పు వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. గత YSRCP ప్రభుత్వం చేసిన జిల్లా విభజనలో ఏర్పడిన గందరగోళాన్ని సరిచేయడం, ప్రజల సౌకర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా మార్పు, చేర్పులపై ఆలోచనలు చేస్తున్నారు.  ప్రజా అభిప్రాయాలను సేకరించి, శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని కమిటీ పనిచేస్తోంది.

కానీ మొత్తం ఏడుగురు మంత్రులతో ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ప్రజల నుంచి సూచనలు సేకరించడంలో కమిటీ పాల్గొంటుంది.  గత ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజాభిప్రాయాలను పట్టించుకోుకండా ..అసమంజసమైన సరిహద్దులతో జిల్లాలను ఏర్పాటు చేశారన్న అభిప్రాయం ఉంది.  రంపచోడవరం నుంచి  జిల్లా కేంద్రానికి 187 కి.మీ. దూరం ఉంది. దీని  వల్ల గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు ఇవి సరిచేయడానికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.               

అలాగే సరిహద్దులు , పేర్ల మార్పుపైనా కసరత్తులు చేస్తున్నారు.  జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడం. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ల ఆధారంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.  ఇతర జిల్లాల్లో సరిహద్దులు మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి.  అద్దంకి (బాపట్ల జిల్లా), కందుకూరు (నెల్లూరు జిల్లా) ఒంగోలు, కొండపి, సంతనుతలపాడు (మొత్తం 5 నియోజకవర్గాలు)తో ప్రకాశం జిల్లా, కృష్ణ జిల్లా నుంచి గన్నవరం, పెనమలూరు NTR జిల్లాలో కలపడం (విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, తిరువురు, మ్యలవరం – మొత్తం 7). విజయనగరం జిల్లా నుంచి ఎస్.కోటా విశాఖపట్నంలో చేర్చడం, తూర్పు గోదావరి జిల్లాలో మండపేట చేర్చడం, కాకినాడ జిల్లాలో రామచంద్రాపురం చేర్చడం. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు చేర్చడం వంటి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది.  కలెక్టర్ల ద్వారా సూచనలు సేకరణ, ప్రజా అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారు.  

 మార్కాపురం కొత్త జిల్లాను  గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు చేర్చి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.  గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 29 గ్రామాలు, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట వంటి 5 నియోజకవర్గాలతో అమరావతి జిల్లా   ఏర్పాటు,   రంపచోడవరం డివిజన్, చింతూరు డివిజన్ నుంచి 4 మండలాలు కలిపి రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల సరిహద్దులు మార్చే ప్రక్రియ  ఉది.                       

 కమిటీ ఈ నెలలోనే సమావేశాలు నిర్వహిస్తూ, అసెంబ్లీ సమావేశాలకు ముందు   నివేదిక సమర్పించనుంది.  మొత్తం ప్రక్రియ 2025 డిసెంబర్ 31కి పూర్తి చేయాల్సి ఉటుది.  2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు సెన్సస్ కారణంగా జిల్లా మార్పులు చేయలేరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Rukmini Vasanth: ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
Embed widget