అన్వేషించండి

CM Chandrababu: జనాభా నియంత్రణతో చాలా నష్టపోయాం, ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh News | జనాభా నియంత్రణతో చాలా నష్టపోయామని, భవిష్యత్తులో జనాభా నిర్వహణకు పాలసీలు తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

World Population Day 2025 | అమరావతి: ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలని, ప్రస్తుతం చేయాల్సింది జనాభా నియంత్రణ కాదని.. నిర్వహణ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జనాభాను భారం కాకుండా, ఆస్తిగా భావించే రోజులు వచ్చాయన్నారు. మితి మీరిన జనాభా నియంత్రణ వల్ల ఎంతో నష్టపోయామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్ని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కొన్ని దేశాల్లో సంతానోత్పత్తి తగ్గడంతో ఏజింగ్ సమస్య వచ్చిందని, యువత తగ్గడంతో అక్కడ పనిచేసే శక్తి తగ్గిపోయిందన్నారు.

‘ప్రపంచంలో పలు దేశాల్లో పిల్లలను కనడం తగ్గించారని, దాని వల్ల అక్కడ శ్రామిక శక్తి తగ్గిపోయి సంపాదించే వారు తగ్గిపోతన్నారు. మొన్నటివరకూ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశారు. ఇప్పుడు జనాభా నిర్వహణపై ప్లాన్ చేయాలి. రాష్ట్ర, భారత్ భవిష్యత్తు కోసం పనిచేయాలి. వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంద్ర 2047 సక్సెస్ కావాలి. జనాభానే మన ఆస్తి, మన సంస్థ. అభివృద్ధి చెందాలంటే యువత కావాలి. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అగ్ర స్థానంలో ఉండటం మనకు గర్వకారణం. దేశమంటే మనుషులు అనే నినాదానికి తగ్గట్లుగా పనిచేసి ఫలితాలు సాధించాలి.

 

గతంలో స్థానిక సంస్థల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని చట్టం తీసుకొచ్చాం. నేడు జనాభా నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలసీలు తీసుకొస్తాయి. లేకపోతే సమస్యలు తప్పవు. ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి. దాంతో ప్రతిరోజూ కుటుంబసభ్యులు కూర్చుని మాట్లాడుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరకుతుంది. 2.1 గా ఉండే ప్రత్యుత్పత్తి రేటు 1.7కి పడిపోయింది. ప్రజలు లేకపోతే అభివద్ధి లేదు. త్వరలోనే జనాభా నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు ముఖ్యంగా యువతే ఆస్తిగా మారుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఓ కుటుంబంలో 7 మంది ఉంటే అందరికి తల్లికి వందనం ఇచ్చాం. జనాభా నిర్వహణపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అది నిదర్శనం.

మహిళలకు అవకాశాలు ఇచ్చిన పార్టీ టీడీపీ

‘దక్షిణ భారతదేశంలో చర్చ జరుగుతోంది. ఇక్కడి జనాభా తగ్గింది కనుక పార్లమెంట్లో సీట్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో అభివృద్ధి అయింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుచి ఇక్కడికి వస్తున్నారు.  ఇక్కడ వసతులు మెరుగయ్యాయి. జనాభా నియంత్రణ చేయాలని అనుకున్నప్పుడు సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాం. మహిళలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టంతో మహిళలకు ఆస్తి హక్కు వచ్చింది. మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎన్టీఆర్. ఇంటికి పరిమితమైన మహిళల్ని డ్వాక్రా, మెప్మా ద్వారా వారికి అవకాశాలు కల్పించాం. భవిష్యత్తులోనూ పనిచేసేలా ఆలోచించాం. సమైక్యాంధ్రలో దేశంలోనే తొలిసారిగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇంటి పనుల్లో మగవాళ్లు సహకరించాలని సూచించాం. ఆడబిడ్డలు సంపాదనకు బయటకు వెళ్లి వస్తే ఇంటికి వచ్చాక వారికి టీ పెట్టి ఇవ్వాలని మగవారికి చెప్పాం. కాలేజీల్లో వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాం’ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget