అన్వేషించండి

AP Highcourt New Building : ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !

ఏపీ హైకోర్టుకు అదనపు భవనం సమకూరనుంది. కొత్త భవనానికి చీఫ్ జస్టిస్ శంకుస్థాపన చేశారు.


ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవన నిర్మాణానికి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శంకుస్థాపన చేశారు.  సోమవారం ఉదయం 9.50 గంటలకు శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది.   ప్రస్తుతం ఉన్న భవనం పూర్తి స్థాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా అదనపు భవనం నిర్మాణానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ అదనపు భవనాన్ని జి ప్లస్‌ 5 సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ అదనపు భవన నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాల వివరణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు ఉన్నతాధికారులు వివరించారు.   రూ. 29 కోట్ల 40  లక్షల అంచనా వ్యంతో 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 

Also Read: పవన్ ను ప్రజలు రిజెక్ట్ చేశారు... ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునిరేషన్ ఎంత?... అంబటి రాంబాబు ఫైర్

నిజానికి ఈ అదనపు భవన ప్రతిపాదన చాలా కాలంగా ఉంది.  ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం ... అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జిల్లా కోర్టు కోసం ప్రతిపాదించారు. పూర్తి స్థాయి హైకోర్టు భవన నిర్మాణానికి గతంలో శంకుస్థాపన జరిగింది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాలన్నింటినీ నిలిపివేసింది. హైకోర్టు భవనం కూడా పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది.  ఈ కారణంగా ప్రస్తుతం హైకోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగాలంటే మరో భవనం అవసరం అని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం చాలా కాలం ఆలస్యం చేసింది. మూడు రాజధానులు చేస్తున్నందున కర్నూలుకు హైకోర్టుకు తరలించాలని భావిస్తున్నందున అదనపు నిర్మాణం కోసం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. 

Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో

చివరికి  అంగీకారం తెలిపింది.  ఆరు నెలల కిందటే నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నిధుల మంజూరుకు అంగీకారం తెలిపిన తర్వాత టెండర్లు పిలిచారు. కానీ టెండర్లు దక్కించుకోవడానికి పెద్ద పెద్ద సంస్థలేవీ ముందుకు రాలేదు. ఇప్పటికే అమరావతిలో కట్టిన వాటికి పెండింగ్ బిల్లులు ఉండటమే దీనికి కారణం. అయితే రెండో సారి పిలిచిన టెండర్లకు స్పందన ఉండటంతో ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్నూలుకు రాజధాని తరలింపుపై సందిగ్ధం ఉండటంతో శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. 

Also Read:  ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

మూడు రాజధానుల బిల్లులు .. సీఆర్డీఏ  రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకోవడంతో  గతంలో ఏఎంఆర్డీఏ పేరు మీద జారీచేసిన టెండర్లు కూడా ఇప్పుడు సీఆర్డీఏ పేరు మీద ఖరారు చేస్తారు. మొత్తంగా చూస్తే  హైకోర్టుకు మరిన్నిఅదనపు సౌకర్యాలు కలగనున్నాయి. 

Also Read: ఏపీకి వైసీపీ హానికరం... లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేస్తారా.... ఉక్కు దీక్షలో పవన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.