అన్వేషించండి

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం, సరిహద్దుల్లో చెక్ పోస్టులు

రాష్ట్రంలో ప్రతి రైస్ మిల్లును CMRలో భాగాస్వామ్యం  9 సంవత్సరాల్లో ఆరు రేట్లు పెరిగిన ధాన్యం కొనుగోళ్లు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టాలని సీఎం ఆదేశించారు. పక్క రాష్ట్రాల వారు రాకుండా చూసే బాధ్యత అధికారులకే అప్పగించారు. రాష్ట్రంలో ప్రతీ రైసుమిల్లును సీఎంఆర్‌లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ తొమ్మిదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 9రెట్లు పెరిగిట్టు గణాంకాలు చెబుతున్నాయి. రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు పేర్కొన్నారు.

7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు

సీఎం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ , నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించకొని సిద్దం కావాలని సూచించారు. రైతుల పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. ఇందుకోసం 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

CMR అప్పగించే విషయంలో ఆలస్యం జరిగితే ఒప్పుకోం

యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లలు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, FCI అధికారులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్దం చేసుకోవాలని, వచ్చేవారంలో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహిస్తామన్నారు మంత్రులు. యాసంగికి సీజన్ CMRను ఈనెల 30వ తేదీలోగా మిల్లర్లు నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇకనుంచి CMR అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని  హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగులో ఉన్న CMRని అప్పగించి ఈ సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటివరకు  CMRలో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు  ప్రకటించారు.

రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో ఆయా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు పేర్కొన్నారు.  అదనపు కలెక్టర్లు జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు సూచించారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లు గుర్తించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు. ఆరబెట్టిన  ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని, 2014-15లో రూ.3,392 కోట్లతో ధాన్యం సేకరిస్తే, 2020-21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుంది. 9 సంవత్సరాలలో ఆరురెట్ల ధాన్యం కొనుగోలు పెరగ్గా, మిల్లింగ్ సామర్థ్యం రెండురెట్లు మాత్రమే పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు.ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మినిస్టర్లు సూచించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏప్పటికప్పడు ఆన్ లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టాప్ హెడ్ లైన్స్

Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
Sugar From 1 Quintal Sugarcanes: ఒక క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది? తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఒక క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది? తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget