అన్వేషించండి

Telangana: ఈ వానాకాలంలో లక్ష్యాన్ని అధిగమించిన వరి సాగు, కోటి ఎకరాలు దాటిన విస్తీర్ణం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్ లో వరి సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని అధిగమించింది. 49,86,634 ఎకరాల సగటుకు 55,90,978 ఎకరాలలో అంటే 112.12 శాతం నాట్లు పడ్డట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Telangana: రాష్ట్రం పచ్చని మాగాణిలా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి వసతి ఏర్పడటంతో గతంలో కంటే సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్ లో వరి సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని అధిగమించింది. 49,86,634 ఎకరాల సగటుకు 55,90,978 ఎకరాలలో అంటే 112.12 శాతం నాట్లు పడ్డట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం 55,08,313 ఎకరాల కంటే ఇది 82 వేల ఎకరాలు అధికం. అలాగే 44 లక్షల 70 వేల 360 ఎకరాలతో పత్తి రెండో స్థానంలో నిలిచింది.  ప్రతీ సంవత్సరం ఈ సీజన్ పంటల మొత్తం సాగు లక్ష్యం కోటి 24 లక్షల 28 వేల 723 ఎకరాలకు ఈసారి 1.16 కోట్ల ఎకరాలతో 94 శాతం సాధించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదించింది. 13 జిల్లాలు 100 శాతానికి పైగా సాగు లక్ష్యాన్ని అధిగమించాయని తెలిపింది. మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, పప్పు దినుసులు, సోయాబీన్, పత్తి సాగు కాలం ముగిసిందని.. సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు కొనసాగనున్నాయని తెలిపింది. తద్వారా మొత్తం సగటు సాగు విస్తీర్ణం దాటే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 

రాష్ట్రంలో 24.75 శాతం సజ్జలు, 18.48 శాతం రాగులు, 15.59 శాతం ఉలవలు, 13.35 శాతం బొబ్బర్లు, 6.009 శాతం పొద్దు తిరుగుడు, కొర్రలు, సామలు వంటి చిరు ధాన్యాలు 10.98 శాతం సాగు అయినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మెదక్ లో 122.8 శాతం మహబూబాబాద్ లో 111.99 శాతం, ఆసిఫాబాద్ 109.46 శాతం, జగిత్యాలలో 106.84 శాతం, జనగామలో 106.42 శాతం, నిజామాబాద్ లో 105.60 శాతం, ఆదిలాబాద్ లో 104.49 శాతం, నిర్మల్ లో 103.02 శాతం, యాదాద్రి 103.99 శాతం, సంగారెడ్డిలో 102.56 శాతం, సిద్దిపేటలో 101.31 శాతం, భద్రాద్రిలో, వికారాబాద్ లో 100.. ఇలా ఈ జిల్లాలన్నీ 100 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాయి. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు 75 శాతం లక్ష్యం చేరగా.. మిగతావి వంద శాతానికి చేరువగా ఉన్నాయి. అలాగే రాష్ట్ంలో ఆగస్టులో ఇప్పటి వరకు 208.4 మిల్లీ మీటర్ల వర్షపాతానికి 79.7 మిల్లీ మీటర్ల వర్షమే పడింది. ఈనెలలో 62 శాతం లోటుగా ఉందని తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget