అన్వేషించండి

ధరణితో వేలఎకరాలు కబ్జా చేసిన కేసీఆర్ ఫ్యామిలీ: ఈటల

ధరణి రైతాంగం కోసం పెట్టారా ? వేల ఎకరాల భూమి కొట్టేయడానికి పెట్టారా ? డబ్బుల గని కోసం పెట్టారా ? అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ప్రగతిభవన్ పైరవీల నిలయంగా దొంగలకు అడ్డాగా మారిందని కామెంట్ చేశారు.

తెలంగాణలో నీటి ప్రాజెక్టుల్లో జరిగిన కుంభకోణం కంటే ధరణి కుంభకోణం పెద్దదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధరణి సమస్యలు పరిష్కారం చేసే దమ్ము లేదంటే వెంటనే కేసీఆర్ సీఎంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారాయన. ధరణి కారణంగానే రాష్ట్రంలోని చాలా భూములు కెసిఆర్, ఆయన కుటుంబ కబ్జాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. బేరం కుదిరితే లాక్ ఓపెన్ చేస్తున్నారు. లేదంటే క్లోజ్ చేస్తున్నారని నాంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఆక్షేపించారు. 

దీన్ని డిజైన్ చేసిన కేసీఆర్‌ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు రాజేందర్‌. ధరణి భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిపాలించే నైపుణ్యం లేదు అని రాజీనామా చెయ్యాలన్నారు. భూమి సోషల్ స్టేటస్‌గా భావిస్తారని, ఒక భద్రతని అలాంటి భూమిని ప్రజలకు కాకుండా చేస్తున్నారన్నారు. 

శోధించి, సాధించినట్టు గంభీరస్వరంతో భూ రికార్డ్ సరిచేస్తా అని సభలో కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. భూరికార్డ్ సరిగా ఉంటే జీడీపీ, జీఎస్‌డీపీ 2 అధికంగా ఉంటుందని చెప్తే ప్రజలు అందరు సంతోషించారన్నారు. భూప్రక్షాళన 2 ఏళ్లలో చేసి చూపిస్తా అన్నారని తెలిపారు. ఆ టైంలో జగిత్యాలలో 97శాతం భూ ప్రక్షాళన జరిగిందని కలెక్టర్ చెప్పారన్నారు. ఇది అబద్దమని అప్పుడే తాను చెప్పానన్నారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి అంతా అయిపోయింది కలెక్టర్లు చెప్పారని తెలిపారు. కెసిఆర్ కూడా మెచ్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి ఒక నెల జీతం బోనస్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు.  

ఆ తర్వాత సమస్యలు రావడంతో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ పాపం అంత రెవెన్యూ వారిదేనని తన మీడియాలో చెప్పించారన్నారు ఈటల. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయించారన్నారు. ప్రజల చేత ఛీ కొట్టించి, బోనుకు ఎక్కుంచారని వివరించారు. ఎలుకల బాధకు ఇళ్ళు తగలబెట్టే పనిచేశారని ఆక్షేపించారు. మహిళా ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి తగబెట్టడనికి కారకుడు కెసిఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

2020 అక్టోబర్‌లో ధరణి తీసుకొచ్చి... కలెక్టర్, జెసి, ఆర్డీవోలకు ఉన్న అధికారాలు అన్నీ తీసివేశారని తెలిపారు ఈటల. ఈ అనాలోచిత నిర్ణయాలు కారణంగా లక్షల మంది రైతులు ధరణితో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల ఇబ్బందులతో 24 లక్షల దరఖాస్తు వస్తే కేవలం 6 లక్షలే పరిష్కరించారని ఇంకా 18 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ధరణితో వచ్చిన ఇబ్బందుల కారణంగా ఆదివారం ఒక్కరోజు నలుగురు ఆత్మహత్యయత్నం చేశారని ఆందోళన చెందారు. 

రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి ప్రగతి భవన్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయంతో.. నిషేధిత జాబితా నుంచి మారిపోయిందని తెలిపారు ఈటల. సీఎం నుంచి సీఎస్‌కి అక్కడి నుంచి కలెక్టర్‌కి చెప్పి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్ పైరవీల నిలయంగా దొంగలకు అడ్డాగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహబూబ్‌బాద్ జిల్లా నారాయణపూర్ గ్రామం మొత్తం వివాదాస్పద భూజాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఉన్న రైతులకు రైతుబంధు రాక, బ్యాంక్ లోన్లు రాక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ధరణి వివాదాల వల్ల హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు ఈటల. తాతల కాలంలో అమ్ముకున్న భూములు మళ్లీ వారి పేరు మీదకు వచ్చేసరికి... వాటిని ఇతరులకు అమ్ముకోవడంతో వివాదాలు పెరుగాయన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
APEPDCL Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
PM Kisan Nidhi Yojana : పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?
పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget