అన్వేషించండి

Warangal Khammam Nalgonda Graduate MLC Election 2024 | ప్రశాంతంగా జరుగుతున్న పట్టభద్రుల పోలింగ్ | ABP Desam

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్‌మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఏనుగల రాకేష్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్లతోపాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల విధానాలను వ్యతిరేకించే వాళ్లంతా కూడా స్వతంత్రంగా బరిలో నిలబడుతున్నారు. వీళ్ల కోసం మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం 

తెలంగాణలో 8గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ జరుగుతున్న మూడు ఉమ్మడి జిల్లాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల టైంలో జరుగుతున్న ఘర్షణలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ ఉపఎన్నిక ఫలితాలు జూన్ ఐదు విడుదల కానున్నాయి. 

ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63 వేల 839 మంది పట్టబద్రుల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పట్టభద్రులు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని నమూనాను పోలింగ్ కేంద్రాల వద్ద అవగాహన కోసం ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకమైన పెన్ను అందుబాటులో ఉంచారు. సొంత పెన్నులు వాడకుండా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పెన్నుతోనే ఒకటి రెండు ప్రాధాన్యత ఓట్లను నంబర్లు మాత్రమే వేయాలని అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద సూచనలు చేస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈవీఎం పద్ధతిలో కాకుండా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రధాన పార్టీలతో పాటు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో జంబో బ్యాలెట్‌ను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారిగా వివరించగా మిగతా జిల్లాల అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు మొత్తం 37 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలానికి ఒక పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయగా సిటీలో ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే బ్యాలెట్ బాక్స్ లను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు అధికారులు. కౌంటింగ్ ప్రక్రియ నల్గొండ జిల్లా కేంద్రంలో జూన్ 5వ తేదీన జరగడంతో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో చెందిన బ్యాలెట్ బాక్స్‌లు నల్గొండ జిల్లా కేంద్రానికి తరలివెళ్తాయి.

2021లో ఈ స్థానానికి జరిగిన ఎన్నికలో 5 లక్షల 5 వేల 565 ఓటర్లు ఉండగా.. 3 లక్షల 87 వేల 460 మంది ఓటు వేశారు. జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందు ఎమ్మెల్సీగా ఉండేవాళ్లు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానానికే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
ABP Premium

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget