South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్మార్క్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ వరల్డ్ రికార్డ్
ఉమెన్స్ టి20 వరల్డ్ కప్లో అజేయంగా దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు బ్రేక్ పడింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన హై-వోల్టేజ్ గ్రూప్ మ్యాచ్ లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. ఈ టోర్నమెంట్లో ఇండియాకు ఇదే ఫస్ట్ ఓటమి. దీంతో భారత్ సెమీస్ రేసు మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ అగ్రెసివ్ అప్రోచ్తో ఆడటంతో పవర్ప్లే ముగిసేసరికి ఇండియా వికెట్ నష్టపోకుండా 59 రన్స్ చేసింది. అయితే ఈ కాన్ఫిడెన్స్ను ఇండియా ఎక్కువసేపు కంటిన్యూ చేయలేకపోయింది. మిడిల్ ఓవర్లలో ప్రొటీస్ బౌలర్లు కరెక్ట్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ ఇండియా రన్ రేట్కు బ్రేకులు వేశారు. దీప్తి శర్మ 29 రన్స్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 రన్స్ చేసింది.
ఇక ఈ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలోనే మెన్ లేదా ఉమెన్ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరూ సాధించని విధంగా.. 200 టి20 మ్యాచ్లు ఆడిన ఫస్ట్ క్రికెటర్గా హర్మన్ప్రీత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 159 రన్స్ ఛేజింగ్లో సౌతాఫ్రికా టీమ్కు స్టార్టింగ్లోనే గట్టి షాక్లు తగిలాయి. శ్రీ చరణి 3 వికెట్లు పడగొట్టి ప్రొటీస్ టాప్ ఆర్డర్ను దెబ్బతీసింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ ఆల్రౌండర్ మరిజానే కాప్ ఒంటిచేత్తో మ్యాచ్ను లాగేసుకుంది. 19.1 ఓవర్లలోనే సౌతాఫ్రికాకు విజయాన్ని అందించింది.
ట్రెండింగ్ వార్తలు






















