Vaibhav Suryavanshi 175 vs Eng U19 World Cup Final | రాయుడు తర్వాత రాయుడు వైభవ్ సూర్యవంశీనే | ABP Desam
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది ఇలాంటిది కాదు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు వైభవ్. తను చేసిన 175 రన్స్ కోసం తనేం తెగ పరుగులు తీసి కష్టపడిపోలేదు. ఇన్నింగ్స్ లో 25పరుగులు మాత్రమే రన్స్ రూపంలో వచ్చాయి. మిగిలినవన్నీ బౌండరీ నుంచే లాగేశాడు వంశీ బ్రో. తన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. 15 ఫోర్ల ద్వారా 60 పరుగులు, 15 సిక్సర్ల ద్వారా 90 పరుగులు అంటే 150 రన్స్ బౌండరీతోనే రాబట్టాడు. 2002 అండర్ 19 వరల్డ్ కప్ లో ఇదే ఇంగ్లండ్ మీద అప్పటి కెప్టెన్ అంబటి రాయుడు 177 పరుగులతో నాటౌట్ గా నిలవగా...ఆ తర్వాత అత్యధిక స్కోరు కొట్టిన భారత క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ సూర్యవంశీ ధాటికి భారత్ ఏకంగా 411పరుగులు చేసి ఇంగ్లండ్ కు 412 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది. తను ఉన్నంత సేపు వన్డే మ్యాచ్ ను టీ20 స్టైల్ లో ఆడిన వైభవ్ సూర్యవంశీ 55 బాల్స్ లోనే సెంచరీ కొట్టి భారత్ తరపున యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన బ్యాటర్ గానూ మరో రికార్డు నెలకొల్పాడు. చూడాలి గతేడాది ఐపీఎల్ దగ్గరమైన సూర్యవంశీ దూకుడు..ఈ అండర్ 19 వరల్డ్ కప్ భారత్ కైవసమైతే...అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం ఆడే దిశగా అడుగులు వేస్తుందేమో. అదే జరిగితే సచిన్ కంటే చిన్న వయస్సులో 15ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అత్యంత చిన్నవయస్కుడైన భారత క్రికెటర్ గా సూర్యవంశీ మరోరికార్డును నెలకొల్పుతాడు.























