Mohsin Naqvi India vs Pak T20 WC | ఐసీసీ ఒత్తిళ్లకు లొంగబోమన్న మొహ్సిన్ నఖ్వీ| ABP Desam
టీ20 ప్రపంచకప్లో ( T20 World Cup ) భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ గత కొద్దిరోజులుగా చెప్తున్న పాకిస్తాన్, ( India vs Pakistan ) చివరకు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఫిబ్రవరి 15న జరగనున్న హై-వోల్టేజ్ పోరులో భారత్తో తలపడేందుకు తమ జట్టుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం మరోసారి వివాదాస్పదమైంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League ) సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో, ఐసీసీ నుంచి వస్తున్న ఒత్తిళ్లపై ప్రశ్నించగా, నక్వీ ( Mohsin Naqvi ) రాజకీయ కోణంలో స్పందించారు. భారత్, ఐసీసీ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదని, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా దీనికి కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. క్రికెట్ అంశంలోకి నేరుగా సైన్యాన్ని లాగడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
పాక్, బాంగ్లాదేశ్,శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, ఐసీసీ మధ్య సమావేశం జరిగిన తర్వాత సీన్ రివర్స్ అయింది. అందరి అభ్యర్థన మేరకు 'క్రికెట్ స్ఫూర్తి'ని కాపాడటమే తమ ఉద్దేశమని చెబుతూ పాక్ ప్రభుత్వం మ్యాచ్కు అంగీకరించింది. బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, నిషేధం తప్పదన్న భయం కూడా పాక్ను వెనక్కి తగ్గేలా చేసింది.






















