అన్వేషించండి

Janwada Farm House : జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది ? ఆ ఫామ్ హౌస్ చుట్టూ వివాదమెందుకు ?

Telangana Politics : జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కూల్చేస్తారని బీఆర్ఎస్ నేతలు కోర్టుకెళ్లారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Who owns Janwada Farm House KTR or His Friend  :  తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. బుధవారం జన్వాడ ఫామ్ హౌస్‌ అంశం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు శిఖం భూముల్లో కట్టిన నిర్మాణాలను వరుసగా కూల్చూతూ పోతున్నారు. ఈ క్రమంలో బుధవారం కూల్చబోయేది జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌసేనని  విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫామ్ హౌస్ కూల్చే ప్రయత్నంలో ఉన్నారని అడ్డుకోవాలని కోరారు. అదే సమయంలో  తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తన మిత్రుని వద్ద తీసుకున్నానన్నారు. 

జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని కాంగ్రెస్ ఆరోపణ
 
రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న సమయంలో.. పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమితులు కాక ముందు ఓ సారి సంచలన ప్రకటన చేశారు. మీడియాను తీసుకెళ్లి ఓ అద్భుతం చూపిస్తానన్నారు. అలా మీడియా ప్రతినిధల్ని తీసుకుని జన్వాడ గ్రామం వద్దకు వెళ్లారు. అక్కడ ఫామ్ హౌస్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు. పోలీసులకు దగ్గరకు వెళ్లనీయకపోవడంతో.. అక్కడ డ్రోన్ ఎగురవేసి ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని ఆరోపించారు. అయితే అలా డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు పెట్టి జైలుకు పంపింది. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని గ్రీన్ ట్రిబ్యూనల్‌లోనూ పిటిషన్ వేశారు. అప్పట్లోనే కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్  మాత్రం..  ఆ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని.. కొన్ని భూములు ఆయన భార్య శైలిమ పేరుపై ఉంటే.. మరికొన్ని  బినామీల పేరుపై ఉన్నాయని ఆరోపిస్తున్నాయి.

కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద కొన్ని భూములు 

జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు మీద ఎలాంటి భూములు లేవు. కానీ ఆయన భార్య శైలిమ పేరు మీద కొన్ని భూములు ఉన్నాయి. ఫామ్ హౌస్ ఉన్న భూమి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ చుట్టుపక్కల కూడా మరికొంత మంది ఇతర వ్యక్తులు కొనుగోలు చేశారు. అయితే వీరంతా కేటీఆర్ బినామీలని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. జన్వాడ ఫామ్ హౌస్  తనది కాదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ కేటీఆర్ తరచూ అక్కడకు వెళ్తూంటారు. పార్టీ నేతలతో ఆంతంగిక సమావేశాలు నిర్వహిస్తూంటారు. ఆయన అధీనంలోనే ఫామ్ హౌస్ ఉందని రాజకీవర్గాలకు తెలుసు. అందుకే కేటీఆర్..తాను లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు. అయితే కేటీఆర్ బుకాయిస్తున్నారని లీజుకు తీసుకుంటే.. ఆ పత్రాలు , బ్యాంక్ స్టేట్‌మెంట్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది. 

అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ 

జన్వాడ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డి జైలుకెళ్లారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అత్యంత ఆదునికమైన డ్రోన్లను ఎగురవేసి పూర్తి స్థాయిలో దృశ్యాలు చిత్రీకరించి మీడియాకు ఇస్తున్నారు. అక్కడ నాలాలను కబ్జా  చేశారని..అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.  కేటీఆర్ వినియోగిస్తున్న విల్లా అత్యంత విలాసంగా నిర్మించారని అంటున్నారు. ఈ ఫామ్ హౌస్ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కూలగొట్టేందుకు హైడ్రాకు .. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం వల్ల.. ఏ క్షణమైనా ఆ ఫామ్ హౌస్ పై  బుల్డోజర్లు దాడి చేయవచ్చని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 
ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 
Revanth Reddy Challenges KCR: కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !
కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Embed widget