Telangana Politics: కాంగ్రెస్కు మద్దతుగా కవిత - వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ - బీసీ రాజకీయాలతో మరింత దూరం పెరిగిందా?
BRS Kavitha: బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని కవిత సమర్థిస్తే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. దీంతో కవిత, బీఆర్ఎస్ మధ్య దూరం మరింత పెరిగినట్లవుతోంది.

Telangana BRS BC Politics: భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిచ్చు రేపింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలని కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం రాగానే జాగృతి అధ్యక్షురాలు కవిత సంబరాలు చేసుకున్నారు. జాగృతి పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చిందని రిజర్వేషన్లు ఇచ్చిందని.. ఇది తమ పోరాట ఫలితమేనని చెప్పుకొచ్చారు. కవిత సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థించారు.
I welcome the State Cabinet’s decision to hold local body elections only after providing for 42% reservation for backward classes by amending the existing Act.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 10, 2025
Necessary steps in this regard should be initiated immediately.The state government’s decision is a clear victory for…
కవిత స్పందనతో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు షాక్కు గురయ్యాయి. తాను బీఆర్ఎస్ పార్టీనేనని కవిత చెబుతున్నారు. తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కూడా చెబుతున్నారు. ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన పాడ్కాస్ట్లో బీఆర్ఎస్కు తన కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఇచ్చానని..తాను కూడా వారసురాలినేనని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సంబరాలు చేయడం ఆసక్తి రేపింది. ఇదే బీఆర్ఎస్ విధానం అనుకుంటారేమోన్న ఆందోళనలతో వెంటనే ఇతర బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
బీసీ బిల్లులో న్యాయపరంగా చాలా లొసుగులు కనిపిస్తున్నాయి. కులగణన తప్పుగా చేసి బీసీల జనాభా తక్కువగా చూపించారు. ఇది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు.
— BRS Party (@BRSparty) July 11, 2025
ప్రజలను మభ్యపెట్టి... చేతులు దులుపుకొని పోయే వ్యవహారం కనిపిస్తోంది. బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకురావడం… pic.twitter.com/aRgM3EnlQa
ఆర్డినెన్స్ తోనే బీసీ రిజర్వేషన్లు ఎలా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్లు ఇస్తే.. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటాయని ... అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని అంటున్నారు. అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.
బీసీలకు 42 శాతం కోటాకు చట్టబద్ధత కల్పించకుండా..
— BRS Party (@BRSparty) July 11, 2025
నమ్మించి గొంతుకోస్తున్నది కాంగ్రెస్ సర్కార్!
ఆర్డినెన్స్కు క్యాబినెట్ నిర్ణయం ఒక డ్రామా.. చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసీ
దులిపేసుకునే యత్నం చేస్తున్న బీసీ ద్రోహి రేవంత్.
ఆర్డినెన్సే పరిష్కారమైతే, అసెంబ్లీ తీర్మానమెందుకు… pic.twitter.com/RaUGUVu14w
ఓ వైపు కవిత స్వాగతించడం.. మరో వైపు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించడం.. ఆ పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితిని మరోసారి బయట పెట్టినట్లయింది. కవిత రాత్రికిరాత్రి సంబరాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసిందన్న భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లో కూడా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కవిత విషయంలో ఎలాంటి చర్యలు, కామెంట్లు చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. కవిత మాత్రం తన రాజకీయాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు.





















