అన్వేషించండి

Children Missing: భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు? ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయి?

Children Missing: పిల్లలను అక్రమంగా తీసుకువెళ్లి, శిక్షణ ఇచ్చి, భిక్షాటన చేయిస్తారు. హోటళ్ళలో పనిచేసే చాలా మంది పిల్లలు అలాంటివారే.

Children Missing: భారతదేశంలో చిన్నపిల్లలను అక్రమంగా ఉద్యోగాల‌్లో పెట్టి, వారిని ఎక్కడి నుంచో దొంగతనంగా తీసుకువచ్చి, ఆహారం ఇచ్చి వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. పిల్లలు అదృశ్యమవడం జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య కూడా మారింది.  వారిని కిడ్నాప్‌ చేసి వారిని అక్రమంగా తరలించి, బాల కార్మికులుగా,  వేశ్యావృత్తి, ఇతరుల ఇళ్లలో పని చేయడానికి బలవంతం చేస్తున్నారు. 

ఇందులో ఎక్కువగా పేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని ఉద్దేశపూర్వకంగా గాయపరచి,  వికలాంగులుగా చేసి భిక్షాటన చేయించడం సర్వసాధారణం అయిపపోయింది. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా విడాకుల కేసుల‌లో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి చిన్న వయసులోనే ఏదైనా చేయాలనే కల వారిని నేరం లేదా తప్పుడు పనులలోకి నడిపిస్తుంది.  భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి పిల్లలు అదృశ్యమవుతున్నారో ఇక్కడ చూద్దాం. 

మధ్యప్రదేశ్

మహిళా, అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో, జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు మొత్తం 2,75,125 మంది పిల్లలు అదృశ్యమయ్యారని పేర్కొంది. వీరిలో 62,237 మంది బాలురు, 2,12,825 మంది బాలికలు ఉన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. లోక్‌సభలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 61,102 మంది పిల్లలు మధ్యప్రదేశ్ నుంచి అదృశ్యమయ్యారు, వీరిలో 49,024 మంది బాలికలు ఉన్నారు. 

పశ్చిమ బెంగాల్ 

మధ్యప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో 49,129 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, వీరిలో 41,808 మంది బాలికలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైన పిల్లలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి, వారిని వివిధ రకాల పనులు చేయిస్తున్నారు.

కర్ణాటక 

మూడో స్థానంలో దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటక ఉంది. మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలో, జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు కర్ణాటకలో 27,528 మంది పిల్లలు అదృశ్యమయ్యారని తెలిపారు, వీరిలో 18,893 మంది బాలికలు ఉన్నారు. 

గుజరాత్ 

అత్యధికంగా పిల్లలు అదృశ్యమైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా ఉంది. నివేదిక ప్రకారం, గుజరాత్‌లో 20,081 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, వీరిలో 16,432 మంది బాలికలు ఉన్నారు. 

ఢిల్లీ

ఈ జాబితాలో చివరి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఢిల్లీలో జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు 22,964 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వీరిలో 15,365 మంది బాలికలు ఉన్నారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రం ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటీ?

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి టాప్ మిస్సింగ్ జాబితా ఎక్కువగానే ఉంది. తెలంగాణ మాత్రం 8వ స్థానంలో ఉంది. ఇక్కడ రికవరీ రేటు ఎక్కువగా కనిపిస్తోంది. 

తెలంగాణలో దాదాపు పదివేల మంది మిస్ అయ్యారు. 2022లోనే దాదాపు 3443 మంది మిస్సయ్యారు. మొత్తంగా ఇంకా నాలుగువేలకుపైగా కేసులు పెండింగ్‌ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటులో మాత్రం తెలంగాణలో టాప్‌లో ఉంది. 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు 3000-3500 మంది మిస్ అయ్యారు. ఇందులో దాదాపు ౩వేల వరకు కేసులు ట్రేస్ అయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget