అన్వేషించండి

Medaram Jatara: సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం, ముగిసిన మేడారం మహా జాతర

మహా జాతర ముగిసింది. వనదేవతల వనప్రవేశంతో ప్రక్రియ పూర్తైంది. దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన జాతరను కోటిమందికిపైగా దర్శించుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మేడారం మహా జాతర విజయవంతమైంది. దాదాపు కోటి 50 లక్షల మంది వనదేవతలను సందర్శించారు. తమ ఇష్ట దైవాలను తనివితీరా పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఏర్పాట్లలో, నిర్వహణలో నిమగ్నమై విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, పూజారులు, ఆదివాసీ సంఘాలు, భక్తులు సహా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రభుత్వం కృతజ్ఞత చెప్పింది. 

ఎప్పుడూ లేనట్టు జాతర కోసం 75 కోట్లు కేటాయించినట్టు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా మరో 10 కోట్లు, మొత్తం 85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. చాలా వరకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టారు. 

కరోనా కారణంగా జాతర ఉంటుందో లేదో అన్న అనుమానాలతో మూడు నెలల ముందు నుంచే భక్తులు రాకపోకలు ప్రారంభిచారు.  జాతర ప్రారంభమయ్యే టైంకి 60 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ రాత్రి ముగిసే నాటికి కోటి 50 లక్షలకు భక్తుల సంఖ్య చేరుతుంది. పార్కింగ్, సీసీ కెమెరాలు, చెక్కింగ్ పాయింట్ల వద్ద జరిగిన లెక్కింపు ఆధారంగా ఈ వివరాలను ప్రభుత్వం అందించింది. 

జాతర ముగిసిన తరువాత కూడా లక్షల మంది వరకు భక్తులు దర్శించుకోనున్నారు. అందుకే వాళ్లకు కూడా ఎటుంవంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు తెలిపారు. ప్రయాణ సదుపాయలు, రోడ్డు ఇతర మౌలిక వసతులు పెరగడంతో భక్తులు రాకపోకలు చాలా సులభతరమైందన్నారు. 

ఈసారి ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేవని, భక్తులు ఎక్కువగా ఆగిపోలేదని ఒక్క రాత్రి మాత్రమే ఉండి వెళ్లారని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. అమ్మ వార్ల మహిమకు, భక్తుల నమ్మకంతో కరోనా విజృంభణ తగ్గి అంతా సజావుగా సాగిందని మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
 
జాతర కోసం 8జోన్లలో 12 వందల మంది అధికారులు, 3వందల మంది మెడికల్ సిబ్బంది, వైద్య శిబిరాలు, 9 వందల మంది పారామెడికల్ సిబ్బంది, 10 వేల 3వందల మంది పోలీసు అధికారులు, 4వేల మంది పారిశుద్ధ్యకార్మికులతో పాటు అధనంగా మరో 1వేయి మంది అధికారులు పని చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ లు అందక సాంకేతిక సమస్యలు తలెత్తకుండా 30 సెల్ ఫోన్ టవర్లు, 3వందల శాశ్వత, 6400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కొరకు 3545 ఆర్టీసి బస్సులు నడిచాయి. తాగునీటి కోసం 500 బోర్లు, 4ఓ.హెచ్.ఆర్.ఎస్ ట్యాంకులు, స్నానాల కోసం 354 ఘట్టాలు ఏర్పాటు చేశారు. 

ఈ అనుభవాలతో, వచ్చే జాతరను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. సీఎం ఆదేశాల మేరకు శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేసినట్టు పేర్కొన్నారు మంత్రులు. ఇంకా భూ సేకరణ చేపట్టి శాశ్వత నిర్మాణాలు చేపడితే, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండవని మంత్రులు అన్నారు.
జాతరలో ఎలాంటి ఇబ్బందుల లేకుండా గతంలో ఎన్నడు లేనివిధంగా చాలా సజావుగా జరగిందన్నారు మంత్రులు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!
తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget