అన్వేషించండి

Medaram Jatara: సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం, ముగిసిన మేడారం మహా జాతర

మహా జాతర ముగిసింది. వనదేవతల వనప్రవేశంతో ప్రక్రియ పూర్తైంది. దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన జాతరను కోటిమందికిపైగా దర్శించుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మేడారం మహా జాతర విజయవంతమైంది. దాదాపు కోటి 50 లక్షల మంది వనదేవతలను సందర్శించారు. తమ ఇష్ట దైవాలను తనివితీరా పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఏర్పాట్లలో, నిర్వహణలో నిమగ్నమై విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, పూజారులు, ఆదివాసీ సంఘాలు, భక్తులు సహా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రభుత్వం కృతజ్ఞత చెప్పింది. 

ఎప్పుడూ లేనట్టు జాతర కోసం 75 కోట్లు కేటాయించినట్టు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా మరో 10 కోట్లు, మొత్తం 85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. చాలా వరకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టారు. 

కరోనా కారణంగా జాతర ఉంటుందో లేదో అన్న అనుమానాలతో మూడు నెలల ముందు నుంచే భక్తులు రాకపోకలు ప్రారంభిచారు.  జాతర ప్రారంభమయ్యే టైంకి 60 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ రాత్రి ముగిసే నాటికి కోటి 50 లక్షలకు భక్తుల సంఖ్య చేరుతుంది. పార్కింగ్, సీసీ కెమెరాలు, చెక్కింగ్ పాయింట్ల వద్ద జరిగిన లెక్కింపు ఆధారంగా ఈ వివరాలను ప్రభుత్వం అందించింది. 

జాతర ముగిసిన తరువాత కూడా లక్షల మంది వరకు భక్తులు దర్శించుకోనున్నారు. అందుకే వాళ్లకు కూడా ఎటుంవంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు తెలిపారు. ప్రయాణ సదుపాయలు, రోడ్డు ఇతర మౌలిక వసతులు పెరగడంతో భక్తులు రాకపోకలు చాలా సులభతరమైందన్నారు. 

ఈసారి ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేవని, భక్తులు ఎక్కువగా ఆగిపోలేదని ఒక్క రాత్రి మాత్రమే ఉండి వెళ్లారని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. అమ్మ వార్ల మహిమకు, భక్తుల నమ్మకంతో కరోనా విజృంభణ తగ్గి అంతా సజావుగా సాగిందని మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
 
జాతర కోసం 8జోన్లలో 12 వందల మంది అధికారులు, 3వందల మంది మెడికల్ సిబ్బంది, వైద్య శిబిరాలు, 9 వందల మంది పారామెడికల్ సిబ్బంది, 10 వేల 3వందల మంది పోలీసు అధికారులు, 4వేల మంది పారిశుద్ధ్యకార్మికులతో పాటు అధనంగా మరో 1వేయి మంది అధికారులు పని చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ లు అందక సాంకేతిక సమస్యలు తలెత్తకుండా 30 సెల్ ఫోన్ టవర్లు, 3వందల శాశ్వత, 6400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కొరకు 3545 ఆర్టీసి బస్సులు నడిచాయి. తాగునీటి కోసం 500 బోర్లు, 4ఓ.హెచ్.ఆర్.ఎస్ ట్యాంకులు, స్నానాల కోసం 354 ఘట్టాలు ఏర్పాటు చేశారు. 

ఈ అనుభవాలతో, వచ్చే జాతరను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. సీఎం ఆదేశాల మేరకు శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేసినట్టు పేర్కొన్నారు మంత్రులు. ఇంకా భూ సేకరణ చేపట్టి శాశ్వత నిర్మాణాలు చేపడితే, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండవని మంత్రులు అన్నారు.
జాతరలో ఎలాంటి ఇబ్బందుల లేకుండా గతంలో ఎన్నడు లేనివిధంగా చాలా సజావుగా జరగిందన్నారు మంత్రులు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget