అన్వేషించండి

Minister KTR: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన - యంగ్ వన్ కంపెనీకి శంకుస్థాపన

Minister KTR: వరంగల్ జిల్లా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  

Minister KTR: వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు వెళ్లారు. అక్కడే యంగ్ వన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో టెక్స్ టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్ వన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టీస్ఐఐసీ టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలకను కేటాయించింది. 

తమ వస్త్ర పరిశ్రమల్లో 11 వేల 700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11 వేల 700 మందికి కూడా ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. యంగ్ వన్ కంపెనీ టెక్స్ టైల్ పార్కులో రూ.840 కోట్లు పెట్టనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలా వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్ రూం ఇండ్లను, వరంగల్ లో రూ.135 కోట్లతో చేపట్టి 16 స్మార్టు రోడ్లను కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. 

నిన్నటికి నిన్న జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పని లేదని.. భాగ్యనగరంలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. నేటి నుంచి కొత్త పాలను అందించబోతున్నట్లు స్పష్టం చేశారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ.. వార్డు అధికారితో పాటు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున 150 వార్డుల్లో మొత్తం 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని వివరించారు. ఎంతకాలం సమస్యలు పరిష్కరించాలనే విషయమై వార్డు కార్యాలయంలో పౌర సరఫరాల పత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండగా.. అందులో కోటి మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
Embed widget