అన్వేషించండి

Minister KTR: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన - యంగ్ వన్ కంపెనీకి శంకుస్థాపన

Minister KTR: వరంగల్ జిల్లా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  

Minister KTR: వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు వెళ్లారు. అక్కడే యంగ్ వన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో టెక్స్ టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్ వన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టీస్ఐఐసీ టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలకను కేటాయించింది. 

తమ వస్త్ర పరిశ్రమల్లో 11 వేల 700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11 వేల 700 మందికి కూడా ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. యంగ్ వన్ కంపెనీ టెక్స్ టైల్ పార్కులో రూ.840 కోట్లు పెట్టనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలా వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్ రూం ఇండ్లను, వరంగల్ లో రూ.135 కోట్లతో చేపట్టి 16 స్మార్టు రోడ్లను కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. 

నిన్నటికి నిన్న జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పని లేదని.. భాగ్యనగరంలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. నేటి నుంచి కొత్త పాలను అందించబోతున్నట్లు స్పష్టం చేశారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ.. వార్డు అధికారితో పాటు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున 150 వార్డుల్లో మొత్తం 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని వివరించారు. ఎంతకాలం సమస్యలు పరిష్కరించాలనే విషయమై వార్డు కార్యాలయంలో పౌర సరఫరాల పత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండగా.. అందులో కోటి మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget