అన్వేషించండి

Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం సీరియస్, సూపరింటెండ్ పై వేటు, బాధితుడికి నిమ్స్ లో వైద్యం

Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డయాలసిస్ బాధితుడ్ని ఎలుకలు కొరికి తీవ్రగాయాలు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, డీఎంఈలను ప్రభుత్వం ఆదేశించింది.

Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తామన్నారు. అదే విధంగా ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భీమారానికి చెందిన డయాలసిస్ పేషెంట్ శ్రీనివాస్ ను ఎలుకలు కొరికి ఘటనలో అధికారులు ఎంజీఎం సూపరిండెంట్ తో పాటు మరో ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై వేటు వేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సూపరిండెంట్ శ్రీనివాసరావు బదిలీ చేస్తూ నూతన సూపరిండెంట్ గా డాక్టర్ చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించింది. 

హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు 

ఎలుకలు కొరికిన బాధితుల్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ గోపి, డీఎంఈ రమేష్ రెడ్డి ఎంజీఎంలో ఇవాళ పరామర్శించారు.  శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన తీవ్రంగా కలచి వేసిందని, పారిశుద్ధ్యం లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని శానిటేషన్ కాంట్రాక్ట్ ను బ్లాక్ లిస్టులో పెడతామని, జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాల్సిందిగా డీఎంఈ, జిల్లా కలెక్టర్ లను విచారణ అధికారులుగా నియమించామని విచారణ అనంతరం మరి కొంత మందిపై చర్య తీసుకుంటామని మంత్రి దయాకర్ రావు తెలిపారు.

ఇలాంటి ఘటనలు బాధాకరం 

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు బాధాకరమని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున రోగికి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, సంఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం చర్యలు ఉంటాయన్నారు. రోగులకు భరోసా ఇచ్చే విధంగా వైద్యులు పనిచేయాలని రమేష్ రెడ్డి తెలిపారు.

అసలేం జరిగిందంటే? 

కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఈ నెల 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు. మళ్లీ ఈ ఉదయం(గురువారం) సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ ఎలకల దాడితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Embed widget