అన్వేషించండి

Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం సీరియస్, సూపరింటెండ్ పై వేటు, బాధితుడికి నిమ్స్ లో వైద్యం

Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డయాలసిస్ బాధితుడ్ని ఎలుకలు కొరికి తీవ్రగాయాలు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, డీఎంఈలను ప్రభుత్వం ఆదేశించింది.

Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తామన్నారు. అదే విధంగా ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భీమారానికి చెందిన డయాలసిస్ పేషెంట్ శ్రీనివాస్ ను ఎలుకలు కొరికి ఘటనలో అధికారులు ఎంజీఎం సూపరిండెంట్ తో పాటు మరో ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై వేటు వేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సూపరిండెంట్ శ్రీనివాసరావు బదిలీ చేస్తూ నూతన సూపరిండెంట్ గా డాక్టర్ చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించింది. 

హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు 

ఎలుకలు కొరికిన బాధితుల్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ గోపి, డీఎంఈ రమేష్ రెడ్డి ఎంజీఎంలో ఇవాళ పరామర్శించారు.  శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన తీవ్రంగా కలచి వేసిందని, పారిశుద్ధ్యం లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని శానిటేషన్ కాంట్రాక్ట్ ను బ్లాక్ లిస్టులో పెడతామని, జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాల్సిందిగా డీఎంఈ, జిల్లా కలెక్టర్ లను విచారణ అధికారులుగా నియమించామని విచారణ అనంతరం మరి కొంత మందిపై చర్య తీసుకుంటామని మంత్రి దయాకర్ రావు తెలిపారు.

ఇలాంటి ఘటనలు బాధాకరం 

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు బాధాకరమని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున రోగికి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, సంఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం చర్యలు ఉంటాయన్నారు. రోగులకు భరోసా ఇచ్చే విధంగా వైద్యులు పనిచేయాలని రమేష్ రెడ్డి తెలిపారు.

అసలేం జరిగిందంటే? 

కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఈ నెల 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు. మళ్లీ ఈ ఉదయం(గురువారం) సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ ఎలకల దాడితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS leaders rebellion against Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
రైలులో భోజనం తాజాదో కాదో తెలుసుకునేందుకు ఈ పని చేయండి, చిటికెలో మీకు సమాధానం వచ్చేస్తుంది!
Embed widget