అన్వేషించండి

Revanth CM 2 Years: రాజకీయ పరిమితులు, ఆర్థిక సవాళ్ల మధ్య రెండేళ్లు - సీఎంగా రేవంత్ పనితీరు అంచనాలను అందుకుందా?

Telangana CM Revanth : సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అయ్యాయి. రేవంత్ పాలన తెలంగాణ ప్రజల అంచనాలకు అనుగుణంగా సాగుతోందా

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూనే సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించారు.
  • ఉచిత బస్సు, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేశారు.
  • అభివృద్ధి ప్రణాళికలు మాత్రం ఇంకా ప్రణాళిక దశల్లోనే మిగిలిపోయాయి.
  • కొన్ని హామీలు నెరవేర్చడంలో విఫలం, రాజకీయంగా మాత్రం బలపడ్డారు.

Revanth As CM 2 Years:  తెలంగాణ ప్రజల ఆశలు, అంచనాల మధ్య అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు అయింది. అంటే పదవి కాలంలో నలభై శాతం పూర్తి అయింది. తనదైన మార్క్ చూపించడానికి రెండేళ్ల సమయం సరిపోతుంది. ఆయనపై ప్రజలు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా పాలన సాగుతోందా ?. సంక్షేమం విషయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చారా?. అభివృద్ధి విషయంలో తనదైన మార్క్ చూపించగలుగుతున్నారా?

ఆర్థికంగా పెను సవాళ్లు

ముఖ్యమంత్రి పదవి రాగానే అన్నీ చేసేయాలనుకుంటా రు. కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే..  పదవిలోకి వచ్చే సరికే ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. అందులో మొదటివి ఆర్థికపరమైనవే. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా  వీలయినంతగా వెసులుబాటు  కల్పించుకుని తీరికగా ఉండటం లేదు. తలకు మించిన అప్పుల భారం మోసుకుంటూనే ఉన్నాయి. అలాంటి భారమే రేవంత్ రెడ్డికి  బాధ్యతల  బరువుగా వచ్చింది. రెండేళ్లుగా పథకాల అమలుకు.. అభివృద్ధి పనుల కోసం నిధుల సవాళ్లతో సతమతమవుతూనే ఉన్నారు. అప్పులు తెచ్చి..భూములు అమ్మి ఎక్కడిక్కకడ ఆదాయాన్ని  సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో  విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కంచగచ్చిబౌలి  భూములు.. హిల్ట్ పాలసీ ఇలా ఆదాయ సమీకరణ మార్గాలన్నింటిపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

సంక్షేమం విషయంలో మెరుగైన పనితీరు

ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా.. సీఎం రేవంత్ సంక్షేమ పథకాల విషయంలో ప్రజల అంచనాలను అందుకున్నారనే అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తొలి రోజునే.. పరిస్థితి ఏమిటి... ఎలా అన్నది ఆలోచించకుండా ఉచిత బస్సును ప్రారంభించేశారు. ఎంత కష్టమైనా భరించక తప్పదన్న ఉద్దేశంతో ఆ పథకం ప్రారంభించారు. రెండేళ్లుగా 90 శాతం మంది మహిళలు ఒక్క సారి అయినా ఈ పథకం ద్వారా లబ్దిపొంది ఉంటారు. పేద మహిళలు ఈ పథకం ద్వారా ఎంతో కొంత మిగుల్చుకుంటారు. ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది. సిలిండర్ పథకం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. సన్నబియ్యం పథకం మరో బెంచ్ మార్క్. రేషన్ కార్డు మీద సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లపథకాన్నీఅమలు చేస్తున్నారు.  అయితే సామాజిక పెన్షన్లు పెంచలేకపోవడంతో పాటు తులం బంగారం హామీ వంటివి మాత్రం ఇప్పటికీ ప్రశ్నించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. 

అభివృద్ధి విషయంలో అంతంతమాత్రమే!

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నో ప్రణాళికలు వేశారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ సహా అభివృద్ధిలో తన దైన మార్క్ చూపిస్తానన్నట్లుగా హడావుడి చేశారు. కానీ రెండేళ్ల తర్వాత  ఆ ప్రణాళికల్లో ఎంత పురోగతి అని ఆాలోచిస్తే.. ఇంకా ప్రణాళిక దశల్లోనే ఉంది. ఫ్యూచర్ సిటీలో టెంట్లు వేసి.. పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ఇప్పటికీ ముందుకు పడలేదు. మెట్రో విస్తరణకు  శంకుస్థాపన చేశారు కానీ .. ఎక్కడిదక్కడే ఉంది. కేంద్రం కనీసం రెండో విడతకు  అనుమతి ఇవ్వలేదు. పైగా మెట్రోను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  ఇక రోడ్లపై గుంతల సమస్యల గురించీ విమర్శలు వస్తున్నాయి. రేవంత్  చెప్పిన మాటలకు.. జరుగుతున్న పనులకు పెద్దగా పొంతన లేదని ప్రజలు చర్చించుకునే పరిస్థితి కనిపిస్తోంది.                 

రాజకీయంగా బలపడిన రేవంత్

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల వల్ల తిరుగులేని నేతగా ఎదగడానికి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు కాళ్లు, చేతులు కట్టేస్తూనే ఉంటారు. అయినా రేవంత్ తన పట్టు నిరూపించుకుంటూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సమకూర్చారు. జాతీయ రాజకీయాలకు ఆయన వ్యూహాలే దిక్సూచీ అయ్యాయి.  రెండేళ్లలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. రెండింటిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ఎమ్మెల్యేల  సంఖ్యను పెంచుకున్నారు.  ఎలా చూసినా..రెండేళ్ల పాలనలో రేవంత్ అద్భుతమైన విజయాలు.. భయపడాల్సినంత పరాజయాలు ఏమీ చాూడలేదు. కట్టా..మీఠాగా పాలన సాగిపోయిందని అనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Breaking News: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను నరికేయవద్దు- సుప్రీంకోర్టు
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను నరికేయవద్దు- సుప్రీంకోర్టు
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!
బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Embed widget