అన్వేషించండి

TS Assembly Session: రాష్ట్రంలో మరో 20 ఏళ్లు అధికారం మాదే .. పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానం... అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతలే బ్రాండ్ అంబాసిడర్స్ అని వ్యాఖ్యానించిన ఆయన.. అభివృద్ధిని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు.

తెలంగాణలో మరో 20 ఏళ్లపాటు టీఆర్ఎస్ పార్టీదే అధికారమని మంత్రి కేటీఆర్ అన్నారు.​రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణంతో రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచిస్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నీకెంత, నాకెంత అనే వ్యవహారాలు ఉండేవని ఇప్పుడా ఆ పరిస్థితులు లేవన్నారు. 17 వేలకు పైగా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. కార్ల పరిశ్రమల కోసం ఇతర దేశాలతో పోటీ పడ్డామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ముచ్చర్ల అవతరించబోతోందని కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.​

Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?

పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానం
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చెందితే టీఎస్‌ఐఐసీ ఏర్పాటు అయ్యాక ఆరేళ్లలో 19 వేలకు పైగా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్​ వివరించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న కేటీఆర్ ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ విస్తరిస్తామని ప్రకటించారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 50 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పరిశ్రమలకు గమ్యస్థానంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.​రామగుండం ఫెర్టిలైజర్స్‌, సిర్పూర్‌ పేపర్‌ మిల్లును తిరిగి తెరిపించామని మంత్రి కేటీఆర్ అన్నారు. సర్ఫేసీ యాక్ట్‌ విషయమై ఆర్‌బీఐ గవర్నర్‌ను కలిసి, యాక్ట్‌ వల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయని చెప్పామన్నారు. 

Also Read: ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం

రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్​తెలిపారు. ఐదు జాతీయ రహదారుల వెంబడి కారిడార్లు పెట్టాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బ్రాండ్​ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎవరు ఎంత సంస్కార హీనంగా మాట్లాడినా ప్రజలకు అంతా తెలుసని సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇట్లాంటి రాజకీయాలు మంచివి కావన్న కేటీఆర్... ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టంలో వరంగల్​ జిల్లాలో రైల్​కోచ్​ ఫ్యాక్టరీ పెడతామని కేంద్రం మాట ఇచ్చిందని గుర్తుచేశారు. 2014లోనే భూమిని కేటాయించినప్పటికీ ఫ్యాక్టరీనీ మహారాష్ట్రకు తరలించారని ఆరోపించారు. కరీంనగర్​లో ట్రిపుల్​ ఐటీ, ఆదిలాబాద్​లో గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదన్నారు. పసుపుబోర్డు తెస్తామని బాండుపేపర్​రాసిచ్చిన బీజేపీ నేతలు ఎక్కడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

Also Read: శాసనమండలిలో కల్వకుంట్ల కవిత తొలి ప్రసంగం చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Speaker Decision: అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
Nirmal District Latest News: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Ustaad Bhagat Sing Songs : ఉస్తాద్ భగత్ సింగ్ కాలరే ఎత్తరా సాంగ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాస్ బీట్
ఉస్తాద్ భగత్ సింగ్ కాలరే ఎత్తరా సాంగ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాస్ బీట్
Rajasekhar Gotila Factory : అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
Mahindra Thar EMI Plan: మహీంద్రా థార్ కొనడానికి అవసరమైన జీతం ఎంత? EMI, డౌన్ పేమెంట్ వివరాలేంటీ?
మహీంద్రా థార్ కొనడానికి అవసరమైన జీతం ఎంత? EMI, డౌన్ పేమెంట్ వివరాలేంటీ?
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
When will the war stop: పశ్చిమాసియా యుద్ధం ఆపాలన్నా ఆగదు - అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈగో వార్ కూడా స్టార్ట్ !
పశ్చిమాసియా యుద్ధం ఆపాలన్నా ఆగదు - అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈగో వార్ కూడా స్టార్ట్ !
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget