అన్వేషించండి

TS Assembly Session: రాష్ట్రంలో మరో 20 ఏళ్లు అధికారం మాదే .. పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానం... అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతలే బ్రాండ్ అంబాసిడర్స్ అని వ్యాఖ్యానించిన ఆయన.. అభివృద్ధిని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు.

తెలంగాణలో మరో 20 ఏళ్లపాటు టీఆర్ఎస్ పార్టీదే అధికారమని మంత్రి కేటీఆర్ అన్నారు.​రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణంతో రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచిస్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నీకెంత, నాకెంత అనే వ్యవహారాలు ఉండేవని ఇప్పుడా ఆ పరిస్థితులు లేవన్నారు. 17 వేలకు పైగా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. కార్ల పరిశ్రమల కోసం ఇతర దేశాలతో పోటీ పడ్డామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ముచ్చర్ల అవతరించబోతోందని కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.​

Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?

పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానం
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చెందితే టీఎస్‌ఐఐసీ ఏర్పాటు అయ్యాక ఆరేళ్లలో 19 వేలకు పైగా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్​ వివరించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న కేటీఆర్ ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ విస్తరిస్తామని ప్రకటించారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 50 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పరిశ్రమలకు గమ్యస్థానంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.​రామగుండం ఫెర్టిలైజర్స్‌, సిర్పూర్‌ పేపర్‌ మిల్లును తిరిగి తెరిపించామని మంత్రి కేటీఆర్ అన్నారు. సర్ఫేసీ యాక్ట్‌ విషయమై ఆర్‌బీఐ గవర్నర్‌ను కలిసి, యాక్ట్‌ వల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయని చెప్పామన్నారు. 

Also Read: ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం

రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్​తెలిపారు. ఐదు జాతీయ రహదారుల వెంబడి కారిడార్లు పెట్టాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బ్రాండ్​ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎవరు ఎంత సంస్కార హీనంగా మాట్లాడినా ప్రజలకు అంతా తెలుసని సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇట్లాంటి రాజకీయాలు మంచివి కావన్న కేటీఆర్... ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టంలో వరంగల్​ జిల్లాలో రైల్​కోచ్​ ఫ్యాక్టరీ పెడతామని కేంద్రం మాట ఇచ్చిందని గుర్తుచేశారు. 2014లోనే భూమిని కేటాయించినప్పటికీ ఫ్యాక్టరీనీ మహారాష్ట్రకు తరలించారని ఆరోపించారు. కరీంనగర్​లో ట్రిపుల్​ ఐటీ, ఆదిలాబాద్​లో గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదన్నారు. పసుపుబోర్డు తెస్తామని బాండుపేపర్​రాసిచ్చిన బీజేపీ నేతలు ఎక్కడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

Also Read: శాసనమండలిలో కల్వకుంట్ల కవిత తొలి ప్రసంగం చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget