అన్వేషించండి

Train Reservations: కేవలం ఐదే 5 నిమిషాలు - రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్, సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఈసారి కష్టాలు తప్పవా?

Trains: వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం ఇప్పటి నుంచే ప్రధాన రైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. శుక్రవారం రిజర్వేషన్లు ఓపెన్ కాగా కేవలం 5 నిమిషాల్లోనే రిగ్రెట్ అని చూపించడంతో ప్రయాణికులు నిరాశ చెందారు.

Rail Reservations Completed: వచ్చే ఏడాదికి సంక్రాంతి (Sankranthi) పండుగ కోసం ఊరెళ్లాలనుకుంటున్నారా.?. అయితే, మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటికి రైళ్లల్లో రిజర్వేషన్లు అన్నీ నిండిపోయి రిగ్రెట్ స్టేజ్‌కు వచ్చేశాయి. ముఖ్యమైన రైళ్లల్లో బెర్తులన్నీ అప్పుడే ఫుల్ అయిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి సంబంధించిన రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రధాన రైళ్లైన విశాఖ (Visakha), గోదావరి (Godavari), ఫలక్‌నుమా (Falaknuma), కోణార్క్ (Konark) తదితర రైళ్లకు 8.05 కల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండిపోయాయి. కేవలం 5 నిమిషాల్లోనే రిజర్వేషన్లన్నీ పూర్తి కావడంతో ప్రయాణికులు నిరాశ చెందారు. సంక్రాంతికి 4 నెలల ముందే ఈ పరిస్థితి నెలకొనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈసారీ కష్టాలు తప్పవా

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చి ఉన్న వారంతా సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు రైళ్లతో పాటు బస్సులు కూడా రద్దీగా మారుతాయి. అయితే, రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు, కోచ్‌లు ఏర్పాటు చేసినా అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో జనరల్ కోచ్‌లు జనసంద్రాన్ని తలపిస్తాయి. ప్రతిసారీ ఇదే పరిస్థితి ఉన్నా పరిస్థితి మార్చే దిశగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. జనరల్ కోచ్‌లు, ప్రత్యేక రైళ్లు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలా అయితే కొంత వరకూ పరిస్థితి మారొచ్చని చెబుతున్నారు.

ప్రత్యేక రైళ్లు

అటు, దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ (07442) రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే, శ్రీకాకుళం రోడ్ - తిరుపతి స్పెషల్ ఎక్స్ ప్రెస్ (07443) అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. అటు, సికింద్రాబాద్ - కొల్లం స్పెషల్ ఎక్స్ ప్రెస్ (07193) సెప్టెంబర్ నుంచి నవంబర్ 27 వరకూ, కొల్లం - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (07194) రైలు సెప్టెంబర్ నుంచి నవంబర్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది. మరోవైపు, రద్దీ దృష్ట్యా విశాఖ - కిరండూల్ (08551) రైలు సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో అదనపు విస్టోడోమ్ కోచ్ జోడించనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అటు, సెప్టెంబర్ 15, 22, 29 తేదీల్లో అదనపు థర్డ్ ఏసీ కోచ్‌ను జోడిస్తారు.

కొత్తగా 2 వందేభారత్‌లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా 2 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 16న వీటిని ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రాలోని నాగపూర్ మధ్య.. మరొకటి ఏపీలోని విశాఖ నుంచి ఛత్తీస్ గఢ్‌లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.

Also Read: Chittoor Crime News: చిత్తూరు జిల్లాలోని ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు- నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget