Top Headlines: అమెరికాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ భేటీ - తెలంగాణలో మార్మోగుతోన్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:
1. పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో సరికొత్త టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని మంత్రి లోకేష్ అన్నారు. వై2కె బూమ్ నేపథ్యంలో బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇంకా చదవండి.
2. ఏపీ ఉచిత గ్యాస్ పథకానికి అర్హులు ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మరో కీలకమైన పథకాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అమలు చేసేందేకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత సిండర్ల పథకానికి అర్హులు అవుతారు. అలాంటి వారి వద్ద ఒక ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. వాళ్లకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన ఉండాలి. ఇంకా చదవండి.
3. అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు ఆసక్తికర విషయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు జైలుకు వెళ్లిన ఎపిసోడ్ తెలుగు రాజకీయాల్లోనే చాలా ప్రత్యకమైంది. అరెస్టు నుంచి ఆయన విడుదల వరకు జరిగిన పరిణామాలు ఆసక్తిని రేపిస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో జైల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ పీక్ సీన్గా చెప్పుకోవాలి. అసలు ఆ రోజు వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు. సడెన్ బయటకు వచ్చిన జనసేనానీ ప్రస్తుత డీసీఎం పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించడం వెనుక ఏం జరిగిందనే ఆసక్తి అందరిలో ఉంది. ఆ విషయాలను బాలకృష్ణతో పంచుకున్నారు చంద్రబాబు. ఆహాలో నిర్వహించే అన్స్టాపబుల్ షోలో చాలా ఆసక్తిరమైన సంగతులు రివీల్ చేశారు. ఇంకా చదవండి.
4. అతిపెద్ద గాంధీ విగ్రహం వెనుక సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్
గుజరాత్లో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటే విగ్రహం కంటే అతి పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్లోని బాపూఘాట్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మహాత్ముడ్ని బీజేపీ గౌరవించడం లేదని ఆయన అభియోగం. తాము గౌరవిస్తామని ఆయన చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చేిసన ఈ ప్రకటన అత్యంత వ్యూహాత్మకమైనదిగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెట్టే అంశాలను రేవంత్ వరుసగా తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగానే మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటు ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. ఇంకా చదవండి.
5. తెలంగాణలో మార్మోగుతోన్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం
తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఏకంగా కానిస్టేబుళ్లే రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. నలుగురు కానిస్టేబుళ్ల భార్యల ధర్నాతో మొదలైన ఉద్యమానికి అనూహ్యమైన మద్దతు వస్తోంది. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుపై కానిస్టేబుళ్లు తిరుగుబాటు చేశారు. ఆయన వెళ్లిపోయే వరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకా చదవండి.
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు























