Santosh Nagar Steel Bridge: ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
Hyderabad Steel Bridge: కింద వాహనాలు వెళ్తూంటాయి.. పైన స్టీల్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. కార్మికులకు కనీస రక్షణ లేకుండా.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి

Work on Santosh Nagar Steel Bridge is going on in a very dangerous manner: హదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. గిర్డర్ల ఏర్పాటు సమయంలో కార్మికులు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో కింద వాహనాల రాపోకల్ని కూడా ఆపలేదు.
నిర్మాణ స్థలంలో కార్మికులు కనీసం రక్షణ బెల్టులు , హెల్మెట్లు కూడా లేకుండా గిర్డర్లపై నడుస్తున్న తీరు అత్యంత ప్రమాదకరంగా పనిచేస్తున్నారు. ఒకవేళ పొరపాటున గిర్డర్లు జారినా లేదా కార్మికులు కాలు జారినా జరిగే ప్రాణనష్టం జరుగుతుంది. ఇంతటి భారీ నిర్మాణ పనుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి.
Such callousness with human lives !! Even basic precautions such as a harness and helmet are missing and not even to mention what could happen if the girders slip and fall
— KTR (@KTRBRS) March 3, 2026
The Engineering team of GHMC should be taken to task and the agency should be black listed for endangering… https://t.co/zCQe9MWR2w
దీనిపై కేటీఆర్ స్పందించారు. కార్మికులు , వాహనదారుల ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్న సదరు నిర్మాణ సంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ బృందాన్ని బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పనుల పేరుతో సామాన్యుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టడం సరికాదని హితవు పలికారు.
బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న ఆ వర్కర్స్ ఎంత రిస్కీ వర్క్ చేస్తున్నారో చూడండి .. కొద్దిగా స్లిప్ అయితే ప్రాణాలు పోవడమే .. ఆ దృశ్యాలు చూస్తుంటే మనకే కళ్ళు తిరుగుతున్నాయి .. వారి భద్రత విషయంలో కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు .. అలాగే కింద రోడ్డు మీద జనాలు వాహనాల్లో… pic.twitter.com/NpdwbUSkQD
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) March 2, 2026
సంతోష్ నగర్ వంటి రద్దీ ప్రాంతంలో ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న సమయంలో కింద వాహనాలు వెళ్తుంటాయి. పైన గిర్డర్ల అమరికలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్తో స్పందించిన అధికారులు, తక్షణమే నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది.























