అన్వేషించండి

Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు... 182 కరోనా కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో తాజాగా 12 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరాయి. గడచిన 24 గంటల్లో 37,839 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,844కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ వివరాలు ప్రకటించింది. గత 24 గంటలలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,023కి కరోనాతో మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 3,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ రికవరీ రేటు 98.90 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.59 శాతం ఉందని బులిటెన్‌లో ప్రకటించింది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిలో 10 మందికి కొత్త వేరియంట్‌ సోకింది. వీరి కాంటాక్ట్స్ లో ఇద్దరి వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్‌ని గుర్తించారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 10 మంది కోలుకున్నారు. 

Also Read: నైట్ కర్ఫ్యూతో ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుతుందా ? హౌ? ఎలా?

వరంగల్ లో ఒమిక్రాన్ కేసు

వరంగల్ జిల్లాలో మరోసారి ఒమిక్రాన్ కలకలం రేగింది. నగరంలోని బ్యాంక్ కాలనీలో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. ఈ మేరకు వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఈనెల 12న స్విట్జర్లాండ్ నుంచి యువకుడి వరంగల్ కు వచ్చాడు. అతడికి సాధారణంగా కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ నిర్థారణ అయింది. అనంతరం  నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అతడికి ఒమిక్రన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే యువకుడిని హైదరాబాద్ లోని టిమ్స్ కు రిఫర్ చేశారు వైద్యులు. అతడి దగ్గర బంధుమిత్రులకు 20 మందికి శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. వెంకటరమణ తెలిపారు. 

Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా? 

సిరిసిల్లలో ముగ్గురికి ఒమిక్రాన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్‌ సోకినట్టు వచ్చినట్లు తేలింది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వచ్చింది. తాజాగా బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్‌ వ్యాప్తించింది. ఒమిక్రాన్‌ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌ టిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

Also Read: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... కేరళ, ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ... కోవిడ్ నియంత్రణ చర్యలు పొడిగింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget