అన్వేషించండి

Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?

Amaravati: రాజధానిగా అమరావతిని నోటిఫై చేసే విషయంలో గందరగోళం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం పంపించిన బిల్లును కేంద్రం తిరిగి పంపించినట్టు చెబుతున్నారు.

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయడానికి కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన బిల్లును తిరిగి పంపించిందని కూడా వార్తలు వస్తున్నాయి. న్యాయపరమైన చిక్కులు, నిధులు సమస్యల కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని ఎప్పుడైనా బిల్లు ఆమోదం పొందవచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

మూడో మాట లేకుండా చేద్దామనే ప్రయత్నాల్లో కూటమి

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌గా నోటిఫై చేయించుకుంటే భవిష్యత్‌లో మార్పులు చేర్పులకు అవకాశం ఉండని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విడిపోయిన తర్వాత కమిషన్ వేసి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా పెట్టేందుకు అంగీకరించలేదు. దీంతో మూడు రాజధానులు అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. వివిధ కారణాలతో మూడు రాజధానుల వ్యవహారం కూడా ముందుకు సాగలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు రాజధానుల వాదనను ప్రజలు తిరస్కరించారు. 

అమరావతిని నోటిఫై చేయించుకోవాలని ప్రయత్నాలు

2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేసింది. అక్కడ అభివృద్ధి పనుల కోసం వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ మార్చకుండా ఉంటాయా అనే అనుమానం ఉంది. దీంతో భవిష్యత్‌లో ఇలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా ఉండేందుకు కేంద్రమే ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.

బిల్లును కేంద్రం వెనక్కి పంపినట్టు సమాచారం

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రానికి కూటమి ప్రభుత్వం బిల్ పంపించింది. 2014 నుంచి గుర్తించాలని పేర్కొంది. ఇలా చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం భావిస్తుందని అంటున్నారు. 2024 నుంచి గుర్తిస్తే అప్పటి వరకు చేసిన ఖర్చులపై కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఇప్పటికే పంపిన బిల్లును తిరిగి వెనక్కి పంపించారని అంటున్నారు. ప్రత్యామ్నాయాలతో బిల్లు పంపించాలని సూచించినట్టు చెబుతున్నారు. 

న్యాయనిపుణులతో చర్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

తిరిగి వచ్చిన బిల్లుపై చంద్రబాబు సర్కారు న్యాయనిపుణులతో చర్చిస్తోందని అంటున్నారు. దీనికి పరిష్కార మార్గాలను కనుక్కునే పనిలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తి అయ్యే లోపుపంపిస్తే కేంద్రం అంగీకరించి సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. లేకుంటే మళ్లీ బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అటు కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. టీడీపీ వర్గాలు కూడా సైలెంట్‌గా ఉన్నాయి. కేంద్రానికి బిల్లు పంపిన సంగతిని మాత్రం ఇప్పటికే ప్రకటించారు.     

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget