అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు

Telangana: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాన నేతలంతా తమ తమ మున్సిపాల్టీల్లో పార్టీని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డారు.

Telangana municipal elections polling ended peacefully :  తెలంగాణలో స్థానిక సంస్థల సమరంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడంతో చాలా మున్సిపాలిటీల్లో భారీగా పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

 భారీగా నమోదైన పోలింగ్ శాతం 

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2,981 వార్డు డివిజన్లకు ఈ ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే రాష్ట్ర సగటు పోలింగ్ 62 శాతంగా నమోదు కాగా, సాయంత్రం ముగిసే సమయానికి అనేక ప్రాంతాల్లో ఈ శాతం 70 దాటినట్లు తెలుస్తోంది. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లకు గానూ భారీ సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 12,944 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పూర్తి ఓటింగ్ పర్సంటేజీపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

చెదురుమదురు ఘటనలు - భారీ భద్రత                                  

పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41,773 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 3,000 మంది అదనపు పోలీసు బలగాలను మొహ రించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా పర్యవేక్షించింది.                        

కౌంటింగ్ ఏర్పాట్లు - ఫలితాల వెల్లడి 

బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించి, గెలిచిన అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆపై మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరుగుతాయి.

ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల జోరును కొనసాగించాలని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా, పట్టణ ఓటర్ల మద్దతుతో తిరిగి పుంజుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ గట్టిగా పోటీనిచ్చింది. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు ముఖచిత్రాన్ని నిర్ణయించనున్నాయి.               


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget