అన్వేషించండి

KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్

Telangana News | బడ్జెట్ సమావేశాల తర్వాత కేసీఆర్ నోరు విప్పారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు. గెలుపు మనదే అని పార్టీ నేతలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆత్మవిశ్వాసం కల్పించారు.

KCR Fires On Congress:  అధికారంలో ఉంటే కత్తులు తిప్పి యుద్దాలు చేస్తామంటారా అని కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు.  కాంగ్రెస్ నేతల చంఢాలపు  మాటలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని..  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్  నాయకత్వంలో పార్టీలో చేరేందుకు సినీ నిర్మాత శ్రీనివాసరెడ్డి, నటుడు రవితేజ తమ అనుచరులతో కలిసి వచ్చారు. వారికి కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తరవాత  కేసీఆర్ మాట్లాడారు.  

ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు ! 

వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలిచి తీరుతుందని  కాంగ్రెస్ ప్రభుత్వం  గెలిచి 11 నెలలు మాత్రమే అయిందని ఇప్పటికే ప్రజలు  ఏం కోల్పోయారో  తెలుసుకుంటున్నారని  వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం  మ్యానిఫెస్టోలో ఇచ్చిన దాని కన్నా 90 శాతం అమలు చేశామన్నారు. అది చేస్తామని, ఇది చేస్తామని తాము పెద్ద పెద్ద మాటలు చెప్పగలమని, కాని నేల విడిచి సాము చేయలేదని ప్రజలకు వాస్తవాలే చెప్పామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో చెప్పినవే చేశామని కేసీఆర్ నేతలతో అన్నారు. అది చేస్తాం.. ఇది చేస్తామన్న పిచ్చి మాటలు తమకు రావా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

కార్యకర్తలు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు !

అయితే అవాస్తవాలు ప్రజలు ఎన్నడూ తాము చెప్పలేదన్నారు.   ఏ పథకం చెపట్టినా తాము సమావేశాలు ఏర్పాటు చేసుకుని బడ్జెట్ అంచనాలు చూసుకునే  దాన్ని ముందుకు తీసుకువచ్చామన్నారు. బలహీనులు,  ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిదన్నారు. ఎన్నికల్లో తాము ప్రజలకు హమీలు ఇచ్చింది పది శాతం అయినా.. ప్రజలు అడగకుండానే వారి అవసరాల మేరకు 90 శాతం పనులు తాము చేసినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం లాగా రాగానే కత్తులు తిప్పుతాం.. యుద్దాలు చేస్తామని, కూలగొడతామని చెప్పలేదన్నారు. ప్రజల కోసమే పని చేసిందన్నారు. 

Also Read: KTR News: నిధులు అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా! ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కేటీఆర్, హరీష్ రావు ఫైర్ 

ప్రస్తుత ప్రభుత్వాధినేతలు మాట్లాడే మాటలు ప్రజలు చూస్తున్నారని చంఢాలంగా మాట్లాడటం తగదని కేసీఆర్ విమర్శించారు. తాను ఇలాంటి మాటలు మాట్లాడగలనని, కాని  అధికారంలో ఉండే వారు మాట్లాడటం తగదని హితవుచెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే ఇలాంటి బాద్యతలు ప్రజలు అప్పగించాలని నేతలు గుర్తెరగాలన్నారు. ఒక వ్యక్తి కోసం, ఓట్ల కోసం ప్రభుత్వాలు పని చేయకూడదన్నారు. ఎర్రబెల్లి దయాకర్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఏం పని చేయలేదన్నారు. గ్రామాల్లో రోడ్లు, అభివృద్ధికి కృషి చేశారని కితాబిచ్చారు.  బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నమ్మకంగా పని చేయాలని వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని కేసీఆర్ చెప్పార. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి  కేసీఆర్  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

                        

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget