అన్వేషించండి

KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్

Telangana News | బడ్జెట్ సమావేశాల తర్వాత కేసీఆర్ నోరు విప్పారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు. గెలుపు మనదే అని పార్టీ నేతలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆత్మవిశ్వాసం కల్పించారు.

KCR Fires On Congress:  అధికారంలో ఉంటే కత్తులు తిప్పి యుద్దాలు చేస్తామంటారా అని కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు.  కాంగ్రెస్ నేతల చంఢాలపు  మాటలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని..  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్  నాయకత్వంలో పార్టీలో చేరేందుకు సినీ నిర్మాత శ్రీనివాసరెడ్డి, నటుడు రవితేజ తమ అనుచరులతో కలిసి వచ్చారు. వారికి కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తరవాత  కేసీఆర్ మాట్లాడారు.  

ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు ! 

వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలిచి తీరుతుందని  కాంగ్రెస్ ప్రభుత్వం  గెలిచి 11 నెలలు మాత్రమే అయిందని ఇప్పటికే ప్రజలు  ఏం కోల్పోయారో  తెలుసుకుంటున్నారని  వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం  మ్యానిఫెస్టోలో ఇచ్చిన దాని కన్నా 90 శాతం అమలు చేశామన్నారు. అది చేస్తామని, ఇది చేస్తామని తాము పెద్ద పెద్ద మాటలు చెప్పగలమని, కాని నేల విడిచి సాము చేయలేదని ప్రజలకు వాస్తవాలే చెప్పామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో చెప్పినవే చేశామని కేసీఆర్ నేతలతో అన్నారు. అది చేస్తాం.. ఇది చేస్తామన్న పిచ్చి మాటలు తమకు రావా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

కార్యకర్తలు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు !

అయితే అవాస్తవాలు ప్రజలు ఎన్నడూ తాము చెప్పలేదన్నారు.   ఏ పథకం చెపట్టినా తాము సమావేశాలు ఏర్పాటు చేసుకుని బడ్జెట్ అంచనాలు చూసుకునే  దాన్ని ముందుకు తీసుకువచ్చామన్నారు. బలహీనులు,  ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిదన్నారు. ఎన్నికల్లో తాము ప్రజలకు హమీలు ఇచ్చింది పది శాతం అయినా.. ప్రజలు అడగకుండానే వారి అవసరాల మేరకు 90 శాతం పనులు తాము చేసినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం లాగా రాగానే కత్తులు తిప్పుతాం.. యుద్దాలు చేస్తామని, కూలగొడతామని చెప్పలేదన్నారు. ప్రజల కోసమే పని చేసిందన్నారు. 

Also Read: KTR News: నిధులు అడిగితే ఎమ్మెల్యేపై దాడి చేస్తారా! ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కేటీఆర్, హరీష్ రావు ఫైర్ 

ప్రస్తుత ప్రభుత్వాధినేతలు మాట్లాడే మాటలు ప్రజలు చూస్తున్నారని చంఢాలంగా మాట్లాడటం తగదని కేసీఆర్ విమర్శించారు. తాను ఇలాంటి మాటలు మాట్లాడగలనని, కాని  అధికారంలో ఉండే వారు మాట్లాడటం తగదని హితవుచెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే ఇలాంటి బాద్యతలు ప్రజలు అప్పగించాలని నేతలు గుర్తెరగాలన్నారు. ఒక వ్యక్తి కోసం, ఓట్ల కోసం ప్రభుత్వాలు పని చేయకూడదన్నారు. ఎర్రబెల్లి దయాకర్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఏం పని చేయలేదన్నారు. గ్రామాల్లో రోడ్లు, అభివృద్ధికి కృషి చేశారని కితాబిచ్చారు.  బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నమ్మకంగా పని చేయాలని వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని కేసీఆర్ చెప్పార. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి  కేసీఆర్  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

                        

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget