అన్వేషించండి

Revanth Reddy: ఈ వరదలు జాతీయ విప‌త్తు, ప్రధాని మోదీ రావాలి - రేవంత్ విన్నపం

Telangana News: ఈ వరదలను జాతీయ విప‌త్తుగా ప్రక‌టించాలని రేవంత్ రెడ్డి ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ విప‌త్తు ప‌రిశీల‌న‌కు రావాల‌ని విన్నవించారు.

Revanth Reddy Review on Floods: భారీ వ‌ర్షాల‌తో పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం.. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లినందున జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  ప్రాణ‌, పంట న‌ష్టాల‌తో పాటు భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లినందున స్వ‌యంగా ప‌రిశీల‌న‌కు రావాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని కోరుతూ లేఖ రాయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని క‌మాండ్ కంట్రోల్ రూంలో ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం స‌మీక్ష నిర్వ‌హించారు. అతి త‌క్కువ స‌మ‌యంలో ఇంత భారీ వ‌ర్షాలు కుర‌వ‌డానికి కార‌ణాలు, ఈ రోజు, రేప‌టి ప‌రిస్థితుల‌పై వాతావ‌ర‌ణ శాఖ అధికారుల‌ను అడిగారు. ఊహించిన దానిక‌న్నా ఎక్క‌వ వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని, గ‌తంలో అయిదేళ్ల‌కో, ప‌దేళ్ల‌కో ఇలా వ‌చ్చేవ‌ని.. ఇటీవ‌ల త‌ర‌చూ వ‌స్తున్నాయ‌ని, దీనిపై మ‌రింత అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

ఈ రోజు, రేపు ఆదిలాబాద్‌, నిజామాబాద్, నిర్మ‌ల్ జిల్లాల్లో వ‌ర్షాలు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అవ‌స‌ర‌మైతే వెంట‌నే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంట‌లు ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. చెరువులు, క‌ల్వ‌ర్టులు, లోలెవ‌ల్ కాజ్‌వేలు ఇత‌ర ప్ర‌దేశాల్లో వివిధ శాఖల అధికారుల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులపై ప్ర‌తి మూడు గంట‌ల‌కో బులెటిన్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ప‌రిహారం పెంపు...
వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం రూ.4 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల‌కు, పాడి ప‌శువుల‌కు ఇచ్చే ప‌రిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేల‌కు, మేక‌లు, గొర్రెల‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.  ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

పంట న‌ష్టంపైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథ‌మిక అంచ‌నాల ప్ర‌కారం రూ.ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల‌కుపైగా పంట న‌ష్టం వాటిల్లింద‌ని అధికారులు తెలిపారు. 4 ల‌క్ష‌ల‌కుపైగా ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగి పంట న‌ష్టం వివ‌రాలు సేక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కామారెడ్డిలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు పంట న‌ష్ట ప‌రిహారం వెంట‌నే విడుద‌ల చేశామ‌ని, ప్ర‌స్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఆయా వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్ర‌భుత్వ బృందాలు సైతం త‌క్ష‌ణ‌మే పంట న‌ష్ట ప‌రిశీల‌న‌కు వ‌చ్చే ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. 

యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ‌...
రాష్ట్రంలోని 8 బెటాలియ‌న్ల‌లో మూడో వంతు యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి త‌క్ష‌ణం ఎందుకు అంద‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. మ‌నం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న బ‌ల‌గాల‌ను పంపుతార‌ని, ఇందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు బ‌దులిచ్చారు.  స్పందించిన ముఖ్య‌మంత్రి మ‌న బెటాలియ‌న్ల‌లోని యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ స‌మ‌స్య‌గా ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా.. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేద‌ని, వెంట‌నే కొనుగోలు చేయాల‌ని సూచించారు. ఒడిశా, గుజ‌రాత్‌ల్లో అలా శిక్ష‌ణ ఇచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని అధికారులు తెల‌ప‌గా... అవ‌స‌ర‌మైతే అక్కడి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, అక్క‌డి అనుభ‌వం ఉన్న‌వారితో శిక్ష‌ణ ఇప్పించాల‌ని సీఎం సూచించారు.  దానికోసం ఒక మాన్యువ‌ల్ రూపొందించాల‌ని, ప్ర‌తి సీజ‌న్ ముందు శిక్ష‌ణ ఇప్పించిన సిబ్బందితో రిహార్స‌ల్స్ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget