అన్వేషించండి

KCR Meets Sharad Pawar: దేశానికి సరికొత్త అజెండా, విజన్ అవసరం ! శరద్ పవార్‌తో భేటీ తర్వాత కేసీఆర్ ఏమన్నారంటే

Telangana CM KCR Meets Sharad Pawar: ముంబైలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, NCP అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని చర్చించారు.

Telangana CM KCR Meets NCP Leader Sharad Pawar: నేడు ముంబైలో పర్యటిస్తున్నతెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. సాయంత్రం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో పవార్‌తో పాటు ఆయన కుమార్తె సుప్రియా సూలే, నటుడు ప్రకాష్ రాజ్, తెలంగాణ నుంచి వెళ్లిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని, దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

సరికొత్త అజెండా, విజన్ కావాలి..
దేశాన్ని సరైన దిశగా నడిపించాలంటే సరికొత్త అజెండా కావాలని, కొత్త విజన్ అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని శరద్ పవార్‌తో చర్చించినట్లు తెలిపారు. అనుభవం ఉన్న నేత కనుక శరద్ పవార్ ఆశీర్వాదం తీసుకున్నాను, ఆయనతో కలిసి పనిచేస్తారు. ఇలాంటి ఆలోచన కలిగిన నేతలతో త్వరలోనే పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనే వాదన తెరపైకి తెచ్చారు. అప్పట్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేద్దామని భావించారు. ఎన్నికల ఫలితాల తరువాత దాదాపు రెండేళ్లు ఈ విషయంపై మాట ఎత్తని కేసీఆర్ గత కొంతకాలం నుంచి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా పావులు కదుపుతున్న కేసీఆర్ నేడు ముంబైకి వెళ్లారు. మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన గులాబీ బాస్, సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

KCR Meets Sharad Pawar: దేశానికి సరికొత్త అజెండా, విజన్ అవసరం ! శరద్ పవార్‌తో భేటీ తర్వాత కేసీఆర్ ఏమన్నారంటే

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackery)తో భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రాంతీయ పార్టీలు పోరాటంలో అడుగు ముందుకేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 1000 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకున్న పెద్ద రాష్ట్రం కనుక మొదట మహారాష్ట్ర నేతలతో భేటీ అయినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడం లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తమకు పాజిటివ్‌గా మలుచుకునే ప్రయత్నంలో కేసీఆర్ బిజీగా ఉన్నారని ఇదివరకే అర్థమైంది. సింగరేణి, ఎల్ఐసీ లాంటి సంస్థల్ని బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తుందని పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలంటే శివసేన, ఎన్సీపీ లాంటి ప్రాంతాలతో కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

Also Read: CM KCR: ఇది ఆరంభం మాత్రమే, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు అవసరం : సీఎం కేసీఆర్

Also Read: KCR Sharad Pawar Meeting: ముంబైలో శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget