అన్వేషించండి

Cm Kcr: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...

యాసంగిలో వరి సేకరణపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తుందని విమర్శించారు.

దేశంలో ఆహార ధాన్యాలు సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ రైతు రాబందు పార్టీ అని విమర్శించారు. 

Also Read:చక్రాలపై మన భవిష్యత్ భద్రంగా ఉంది.. బస్సులో హోం వర్క్ చేస్తున్న విద్యార్థి వీడియో ట్వీట్ చేసిన సజ్జనార్

గత యాసంగి డబ్బులు ఇంకా ఇవ్వలేదు

మంత్రి వర్గ భేటీలో ధాన్యం సేకరణపై చర్చించామని సీఎం కేసీఆర్ అన్నారు. గత యాసంగిలో సేకరించిన ధాన్యానికి కేంద్రం డబ్బులు ఇంకా ఇవ్వలేదన్నారు. మెడ మీద కత్తిపెట్టి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని  లేఖ రాయించుకున్నారని ఆరోపించారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని, కానీ అందుకు కేంద్రం నిరాకరించిందన్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల మేరకు యాసంగిలో బాయిల్డ్‌ రైస్ కు అనుకూలంగా ఉంటుందన్నారు. బాయిల్డ్‌ రైస్‌కు గతంలో ఎఫ్‌సీఐ ప్రోత్సహించిందని, ఇప్పుడు కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎంత కొంటామే స్పష్టంగా చెబితే అంతవరకే పండించి ఇస్తామన్నారు. కేంద్రం సహకరించనప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించామని కేసీఆర్ అన్నారు. దీంతో తెలంగాణలో పంటలు దిగుబడి పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేశారన్నారు. 

Also Read:  థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో రాద్ధాంతం చేసి రైతులందరికీ గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు. కేంద్రం కిరాణా షాపు యాజమానిలా మాట్లాడుతుందన్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజా పంపిణీపై సామాజిక బాధ్యత ఉండాలన్నారు. బీజేపీ వాట్సాప్ యూనివర్శిటీలో పచ్చి అబద్ధాలు ఆడుతుందని విమర్శించారు. తెలంగాణ రైతుల కోసం పేగులు తెగే దాకా కొట్లాడుతానన్నారు. యాసంగిలో వరి సేకరణ ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలే ఉండమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షకాలం పంటను సేకరిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేసీఆర్ సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు రావాలన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇల్లు, దిల్లీలో బీజేపీ ఆఫీస్ ముందు పారబోస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 

Also Read: పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన... వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని ప్లకార్డుల ప్రదర్శన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, ఎవరికీ అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget