అన్వేషించండి

TRS MPs: పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన... వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని ప్లకార్డుల ప్రదర్శన

తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్‌సీఐ కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.

తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. దిల్లీలోని పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్రహం వ‌ద్ద ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలంగాణకు  అన్యాయం చేయొద్దని నినాదాలు చేశారు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్‌స‌భ‌ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.TRS MPs: పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన... వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని ప్లకార్డుల ప్రదర్శన

Also Read: యాంకర్ రవి ఎలిమినేన్ రచ్చ.. ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్.. బ్యాన్ కోసం అమిత్ షాకి లేఖ రాస్తా

రైతుల కోసం ఆందోళన

సీఎం కేసీఆర్ ముందు చూపుతో రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలు అందిస్తున్నామని ఎంపీలు అన్నారు. రైతులకు 24 గంటలూ నాణ్యమైన ఉచిత కరెంటు అందించడం వల్ల దిగుబడులు పెరిగాయన్నారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్‌సీఐ కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను తీసుకురావాలని కోరారు. తెలంగాణలో రైతులకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలవుతున్నాయని... వాటిని దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం ఆందోళన చేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

ధాన్యం సేకరణపై వాయిదా తీర్మానం
 
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర సభ్యులు నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన చేశారు. తెలంగాణ రైతులను శిక్షించవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణలో పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? అని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. వానాకాలంలో తెలంగాణలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండిందని, రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందని ఎంపీలు తెలిపారు. 

Also Read: సమ్మెకు సిద్ధమైన స్విగ్గి డెలివరీ బాయ్స్‌.. స్పందించకుంటే డెలివరీలన్నీ బంద్, కారణం ఏంటంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Hussain Sagar Ganesh immersion rules 2026: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?
ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?
KTR Delimitation statement: ఇప్పుడున్న నిష్పత్తి కొనసాగిస్తే చాలు - డీలిమిటేషన్‌కు సపోర్టు - బీఆర్ఎస్ వ్యూహం మారిందా?
ఇప్పుడున్న నిష్పత్తి కొనసాగిస్తే చాలు - డీలిమిటేషన్‌కు సపోర్టు - బీఆర్ఎస్ వ్యూహం మారిందా?
Erravalli Farmhouse Probe: రేవంత్ రెడ్డి భూముల అస్త్రం - బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఫామ్ హౌస్‌ లెక్కలన్నీ బయటకు వస్తాయా?
రేవంత్ రెడ్డి భూముల అస్త్రం - బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఫామ్ హౌస్‌ లెక్కలన్నీ బయటకు వస్తాయా?
22A Land Declaration: 222A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
22A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget