అన్వేషించండి

Loksabha Elections: లోక్‌సభ ఎన్నికలపై టీ బీజేపీ దూకుడు, ఈ నెలలో రథయాత్రలు

Bharatiya Janata Party: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రజలకు దగ్గరయ్యేందుకు రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది.

Telangana: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ రాష్ట్ర బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తోంది. అందుకే ఎన్నికలపై స్పీడ్ పెంచింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు రెడీ అవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు క్లస్టర్లలో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ బీజేపీ నేతలు ఈ రథయాత్రలను ప్రారంభించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు రథయాత్రలను ప్రారంభించేలా తెలంగా బీజేపీ సన్నాహాలు చేస్తోంది. 20 నుంచి 29వ తేదీ వరకు 10 రోజుల పాటు యాత్రలు కొనసాగనున్నాయి. బీజేపీ అగ్రనేతలు కూడా ఈ యాత్రలలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు కేవలం 8 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి బలం పెంచుకోవాలని కాషాయ దళం చూస్తోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుందనేది పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ అంశాల ఆధారంగా ఓట్లు వేస్తారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉంటుంది. ప్రధాని మోదీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో బీజేపీ హవా దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశముంది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. కానీ ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎవరూ ఊహించని విధంగా 4 స్థానాలు గెలుచుకుంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు విజయం సాధించారు. దీనిని బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను ప్రజలు వేరుగా చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా..13.9 శాతం ఓట్లను దక్కించుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలను దక్కించుకోవాలనేది బీజేపీ టార్గెట్‌ పెట్టుకుంది. అందుకు తగ్గట్లు కార్యాచరణను రూపొందిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను కూడా కాషాయ పార్టీ చేపట్టింది. అభ్యర్థులను దాదాపు ఖరారు చేయగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రకటించే అవకాశముంది.

బీజేపీ ఎప్పుడూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటన చేస్తూ ఉంటుంది. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను ఫాలో కానుంది. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేస్తోన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఇక రేవంత్ రెడ్డి ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఇటీవల వచ్చిన వివిధ సర్వేలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ 12 పార్లమెంట్ సీట్లను గెలుచుకునే అవకాశముందని అంచనా వేశాయి. ఈ సర్వే ఫలితాలు హస్తం పార్టీలో జోష్ నింపుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Advertisement

వీడియోలు

Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Hema Chandra : శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
Balakrishna: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
Rajinikanth : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
Embed widget