అన్వేషించండి

Breaking News Live: కుప్పం మున్సిపాలిటిలో ఉద్రిక్తత... 14వ వార్డు ఏకగ్రీవంపై రచ్చ

ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Telangana Andhrapradesh Breaking News Live on November 11 Breaking News Live: కుప్పం మున్సిపాలిటిలో ఉద్రిక్తత... 14వ వార్డు ఏకగ్రీవంపై రచ్చ
బ్రేకింగ్ న్యూస్

Background

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగం పల్లి బేస్ క్యాంప్‌లో కాల్పులు కలకలం రేపాయి. తోటి జవాన్లపై మరో జవాన్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులని భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులలో మృతి చెందిన వారు రాజమణి యాదవ్, ధాంజీ, రాజీవ్ మండల్ వీరిలో రాజీవ్ మండల్ వెస్ట్ బెంగాల్‌కు చెందినవాడు కాగా, మరో ఇద్దరు బీహార్‌కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్‌ పోల్‌

టీఆర్ఎస్ కార్పొరేటర్ కన్నుమూత

టీఆర్ఎస్ నాయకురాలు, జవహార్ నగర్ కార్పొరేటర్ విశ్రాంతమ్మ (55) మృతి చెందారు. గత 8 నెలలుగా ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె భర్త రాబర్ట్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రకాశం జిల్లా నుంచి 35 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. వార్డు మెంబర్‌గా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆమె.. గత ఎన్నికల్లో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు తదితరులు విశ్రాంతమ్మ పార్థీవదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.

Also Read: Telangana CM KCR ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి

వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్‌లోని బౌద్ధ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం చిలకలగూడ పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్‌ సోఫియా (50) అనే మహిళ నెల రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావునగర్‌ ఏషియన్‌ వైన్స్‌లో పనిచేసే అప్పల అనిల్‌ (22) సహకారంతో అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో ఆ గృహంపై దాడి చేసి పోలీసులు ఓ యువతికి విముక్తి కల్పించారు. ఓ విటుడిని కూడా అరెస్ట్‌ చేశారు.

Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

21:43 PM (IST)  •  08 Nov 2021

హుజూరాబాద్ ఫలితాల పరిశీలకులుగా నంజన్యన్ మత్..

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై అధ్యయన కమిటీ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర సీనియర్ నాయకులు నంజన్యన్ మత్ ను ఏఐసీసీ నియమించింది. ఈ విషయాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నెల రోజులలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు.

 

21:08 PM (IST)  •  08 Nov 2021

ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. వరంగల్-హనుమకొండ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం, జిల్లాలోని మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధిపై ఆరా తీయనున్నారు. జంట నగరాల్లో రైల్వే ట్రాక్‌లపై ఆర్‌వోబీల నిర్మాణంపై సమీక్షించనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్‌రోడ్ పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget