అన్వేషించండి

Revanth Reddy: కోర్టు పట్ల కనీస గౌరవం లేదా? సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు సీరియస్

Telangana News: కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలపై రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును విమర్శించేలా మాట్లాడారు. దీంతో సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court Serious on Revanth Reddy: దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒక రాజ్యాంగ కార్యకర్త అయి ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎవరేం విమర్శించినా పట్టించుకోబోమని, తాము మాత్రం తమ మనస్సాక్షి ప్రకారం విధులు నిర్వహిస్తామని ధర్మాసనం వెల్లడించింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి తాము బెయిల్ ఇవ్వడం లేదా ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తున్నామా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై జైలు నుంచి విడుదల కావడంపై స్పందించారు. ఈమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవిత విడుదలపై రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును విమర్శించేలా మాట్లాడారు. దీంతో సుప్రీంకోర్టు గురువారం ఓటుకు నోటు కేసు పిటిషన్ విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ గవాయి దీనిపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి కవిత బెయిల్ విషయంలో చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు పట్ల కనీస గౌరవంగా ఉండాలని సూచించారు.

ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి.. ఓటుకు నోటు కేసు బదిలీని పిటిషనర్ కోరినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. రేవంత్ తరపున అడ్వొకేట్లుగా ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూత్రా ఉండగా.. మరోసారి ఇలా జరగబోదని వారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget