అన్వేషించండి

Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !

Telangana: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణకు డేట్, టైం ఫిక్స్ చేశారు స్పీకర్. సోమవారం నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు.

Telangana defected MLAs inquiry: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతా  పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను శనివారం ఖరారు చేశారు. సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 11 గంటలకు మొదలయ్యే విచారణలు అక్టోబర్ 1న కొనసాగుతాయి. టిషనర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. రెస్పాండెంట్లుగా టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యదయ్య (చేవెళ్ల), గుడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (జోగులంబ గద్వాల్) ఉన్నారు. స్పీకర్ రెండు వైపులా వాదనలు విని, 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా జరుగుతోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024 మార్చి-ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లోకి చేరారు. దానం నగేందర్ (ఖైరతాబాద్), బండ్లా కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకటరావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్స్‌వాడ), కాలే యదయ్య (చేవెళ్ల), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), గుడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి).  ఈ ఫిరాయింపులపై  బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల  సంజయ్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదలైనవారు స్పీకర్‌  వద్ద అనర్హతా  పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు.  

జూలై 31, 2025న సుప్రీం కోర్టు సిజేఐ బీఆర్ గవాయ్ బెంచ్  స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  ఈ ఆదేశాలతో స్పీకర్  విచారణ మొదలుపెట్టారు. ఆగస్టు 21, 2025న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది  పోచారం శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య, తెల్లం వెంకటరావు, మహిపాల్ రెడ్డి, సంజయ్ రిప్లైలు ఇచ్చారు. వీటిని పిటిషనర్లకు ఫార్వర్డ్ చేసి, 3 రోజుల్లో  అభ్యంతరాలు సమర్పించమని చెప్పారు. సెప్టెంబర్ 19న అదనపు నోటీసులు ఇచ్చి, "అదనపు ఎవిడెన్స్ సమర్పించండి" అని ఆదేశించారు. బీఆర్ఎస్ పిటిషనర్లు  అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఈ కేసుల్లో క్రాస్-ఎగ్జామినేషన్ కీలకం. 

సెప్టెంబర్ 29 సోమవారం, 11 గంటలకు  చింత ప్రభాకర్ vs గుడెం మహిపాల్ రెడ్డి, చింత ప్రభాకర్ vs కాలే యాదయ్య, కల్వకుంట్ల సంజయ్ vs టి. ప్రకాశ్ గౌడ్. పల్లా రాజేశ్వర్ రెడ్డి vs బండ్లా కృష్ణమోహన్ రెడ్డి లను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు.  అక్టోబర్ 1 బుధవారం  మిగిలిన వాదనలు, క్రాస్-ఎగ్జామినేషన్. రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ వింటారు.                                

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget