అన్వేషించండి

Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు

తెలంగాణలో ఎనిమిది గంటలకు ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా కేసీఆర్‌కు చీమ కుట్టినట్లుగా కూడా లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మత, రాజకీయపర్యటనలు చేస్తూ రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

"కేసీఆర్‌ తన మతపరమైన పర్యటనలను రాజకీయాలతో, రాజకీయ పర్యటనలను మతంతో కలిపేస్తున్నారని " టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆలయాల సందర్శన పేరుతో తమిళనాడు సీఎంను కలవడానికి వెళ్లారని... ఆరోపించారు. తన  పర్యటన రాజకీయ పరమైనదా, మత పరమైనదా అనేది కేసీఆర్‌ స్పష్టం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్న టీఆర్ఎస్ నేతల ప్రకటనలను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ఆలోచించే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని... తెలంగాణలో తన సొంత పార్టీ భవిష్యత్తుపై కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత తిరుగుబాటు రావచ్చునని రేవంత్ జోస్యం చెప్పారు.  బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా చేసిన ఆలోచనే కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ విశ్లేషించారు.  

Also Read: ‘‘టీఆర్ఎస్’ అంటే తిరుగులేని రాజకీయ శక్తి..’ ఎమ్మెల్సీ రిజల్ట్స్‌పై ఫుల్ ఖుషీలో నేతలు, కేటీఆర్ కూడా
 
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.   ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కారణమని ఆయన ఆరోపించారు. లక్షలాది మంది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కేసీఆర్‌ రాజకీయ, మతపరమైన పర్యటనల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.   ప్రభుత్వం వరి సేకరణపై అనిశ్చితి, తదుపరి పంటపై స్పష్టత లేకపోవడంతో రైతాంగ పరిస్థితులు అధ్వాన్నంగా మారిందని మండిపడ్డారు. ఇటీవలి కాలంలో 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  ..ఆర్థిక ఇబ్బందులతో పాటు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల రైతులు తమ సాగును వదిలివేయడం వల్ల గాయం లాంటి పరిస్థితిలో ఉన్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.    

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !
 
తెలంగాణలో గత రెండు నెలల్లో ప్రతి ఎనిమిది గంటలకు కనీసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు. "రైతుల ఆత్మహత్యలపై కేసులు నమోదు చేయకుండా ఆపాలని పోలీసు అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం ఉందని లెక్కలను బయట పెట్టకుండా తెలంగాణలో ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’అనే  ప్రచారానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్ విమర్శించారు.   ఆత్మహత్య కేసు నమోదు చేస్తే రైతు బీమా కింద తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్థానిక అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని అందుకే సహజ మరణాలుగా చూపిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.  

Also Read: క్యాంపులతో పట్టు నిలుపుకున్న టీఆర్ఎస్.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ !
 
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తప్పనిసరిగా రూ. ఆరు లక్షలు అందజేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. జీవో 421లోని నిబంధనల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.   రైతులందరూ ఆశలు కోల్పోవద్దని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల హక్కుల కోసం పోరాడి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. దేవాలయాలను సందర్శించడం ద్వారా చేసిన పాపాలు కడిగివేస్కోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా రైతులను మోసం చేసిన కేసీఆర్‌ క్షమాపణలు చెప్పుకునేందుకు దేవాలయాలు తిరుగుతున్నారని విమర్శించారు. 

Also Read: ఆరోగ్య శ్రీ అమలులో నిర్లక్ష్యం వద్దు... వైద్య పరీక్షల్లో ఆలస్యం సహించబోం.. మంత్రి హరీశ్ రావు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Santosh Nagar Steel Bridge: ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
Khammam demolitions Kerala politics: ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం ట్వీట్ - కాంగ్రెస్‌ రియాక్షన్ ఇదే
ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం ట్వీట్ - కాంగ్రెస్‌ రియాక్షన్ ఇదే

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget