అన్వేషించండి

Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు

తెలంగాణలో ఎనిమిది గంటలకు ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా కేసీఆర్‌కు చీమ కుట్టినట్లుగా కూడా లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మత, రాజకీయపర్యటనలు చేస్తూ రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

"కేసీఆర్‌ తన మతపరమైన పర్యటనలను రాజకీయాలతో, రాజకీయ పర్యటనలను మతంతో కలిపేస్తున్నారని " టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆలయాల సందర్శన పేరుతో తమిళనాడు సీఎంను కలవడానికి వెళ్లారని... ఆరోపించారు. తన  పర్యటన రాజకీయ పరమైనదా, మత పరమైనదా అనేది కేసీఆర్‌ స్పష్టం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్న టీఆర్ఎస్ నేతల ప్రకటనలను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ఆలోచించే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని... తెలంగాణలో తన సొంత పార్టీ భవిష్యత్తుపై కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత తిరుగుబాటు రావచ్చునని రేవంత్ జోస్యం చెప్పారు.  బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా చేసిన ఆలోచనే కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ విశ్లేషించారు.  

Also Read: ‘‘టీఆర్ఎస్’ అంటే తిరుగులేని రాజకీయ శక్తి..’ ఎమ్మెల్సీ రిజల్ట్స్‌పై ఫుల్ ఖుషీలో నేతలు, కేటీఆర్ కూడా
 
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.   ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కారణమని ఆయన ఆరోపించారు. లక్షలాది మంది రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కేసీఆర్‌ రాజకీయ, మతపరమైన పర్యటనల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.   ప్రభుత్వం వరి సేకరణపై అనిశ్చితి, తదుపరి పంటపై స్పష్టత లేకపోవడంతో రైతాంగ పరిస్థితులు అధ్వాన్నంగా మారిందని మండిపడ్డారు. ఇటీవలి కాలంలో 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  ..ఆర్థిక ఇబ్బందులతో పాటు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల రైతులు తమ సాగును వదిలివేయడం వల్ల గాయం లాంటి పరిస్థితిలో ఉన్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.    

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి.. ,. స్టాలిన్‌ను ఆహ్వానించిన కేసీఆర్ !
 
తెలంగాణలో గత రెండు నెలల్లో ప్రతి ఎనిమిది గంటలకు కనీసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు. "రైతుల ఆత్మహత్యలపై కేసులు నమోదు చేయకుండా ఆపాలని పోలీసు అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం ఉందని లెక్కలను బయట పెట్టకుండా తెలంగాణలో ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’అనే  ప్రచారానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్ విమర్శించారు.   ఆత్మహత్య కేసు నమోదు చేస్తే రైతు బీమా కింద తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్థానిక అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని అందుకే సహజ మరణాలుగా చూపిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.  

Also Read: క్యాంపులతో పట్టు నిలుపుకున్న టీఆర్ఎస్.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ !
 
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తప్పనిసరిగా రూ. ఆరు లక్షలు అందజేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. జీవో 421లోని నిబంధనల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.   రైతులందరూ ఆశలు కోల్పోవద్దని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల హక్కుల కోసం పోరాడి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. దేవాలయాలను సందర్శించడం ద్వారా చేసిన పాపాలు కడిగివేస్కోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా రైతులను మోసం చేసిన కేసీఆర్‌ క్షమాపణలు చెప్పుకునేందుకు దేవాలయాలు తిరుగుతున్నారని విమర్శించారు. 

Also Read: ఆరోగ్య శ్రీ అమలులో నిర్లక్ష్యం వద్దు... వైద్య పరీక్షల్లో ఆలస్యం సహించబోం.. మంత్రి హరీశ్ రావు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Assembly: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget