అన్వేషించండి

Revant Reddy : సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు

సెప్టెంబర్ 17వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Revant Reddy : కర్ణాటక తరహాలో ముందే మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే యూత్, రైతు, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించింది. త్వరలో మరిన్ని డిక్లరేషన్స్ ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్ 17వ తేదీన మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్మయించారు. హైదరాబాద్‌లో  యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.  ఇందులో రేవంత్ మాట్లాడారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం మీరంతా కష్టపడాలి. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.  

పార్టీ, ప్రజల కోసం పోరాడేవారికి నాయకుడిగా  భవిష్యత్ 

పార్టీ, ప్రజల కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని  నాయకుడిగా మారేందుకు యూత్‌ కాంగ్రెస్‌   ఓ వేదిక అని చెప్పారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రేనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించినలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.  వన్ నేషన్ వన్ పార్టీ అనేది  బీజేపీ  రహస్య అజెండా. బీజేపీ కుట్రలను ఛేదించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాల్సి ఉందన్నారు.    2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు రేవంత్ సవాల్ చేసారు.  ' 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు.   
కేటీఆర్‌, హరీశ్‌ చర్చకు సిద్ధమా?' అని రేవంత్ ప్రశ్నించారు. 

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలి ! 

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు.   అగ్రనాయకులు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయి. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలి. దీనికి అవసరమైన కార్యాచరణపై యూత్‌ కాంగ్రెస్‌కు దిశా నిర్దేశం చేశామన్నారు.  మేనిఫెస్టో ఆలస్యం చేయడం వల్లే గతంలో ఇబ్బంది పడినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పంటకు మద్దతు ధరతో పాటు బోనస్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, రైతుబందు సహాయం పెంపు, చదువుకునే అమ్మాయిలకి ఎలక్రికల్ బైక్స్, నిరుద్యోగ భృతి మొదలగు అంశాలు పొందపరచనున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు 

గడీల పాలన పునరుద్ధరించేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని రేవంత్ విమర్శించారు.  కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను కచ్చితంగా రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి భూముల్లో అవకతవకలు జరిగాయి. వేల ఎకరాల భూమిని కేసీఆర్‌.. బినామీలకు కట్టబెట్టారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిపోయింది. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా అని ప్రశ్నించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Kavitha new party: శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget