అన్వేషించండి

Minister KTR : ఆహారసూచీలో అట్టడుగు స్థానంలో భారత్, నూకలు తినమన్న వారి తోకలు కత్తిరించాలి- మంత్రి కేటీఆర్

Minister KTR : ధాన్యం కొనుగోళ్లు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేటుకు కొనుగోళ్లు అప్పగిస్తే మన మరణ శాసనం మనం రాసుకున్నట్లే అని తెలిపారు.

Minister KTR : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడ లో జరిగిన రైతు అవగాహన సదస్సులో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. నూకలు తినమన్న వారి తోకలు కత్తిరించాలని మండిపడ్డారు. దక్షిణాసియాలో భారత్ ను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత స్థానంలో నిలబెట్టారన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు లేవన్నారు. తెలంగాణ మినహా దేశంలోని మిగతా 27 రాష్ట్రాల్లో రైతు కంట కన్నీరు కారుతున్నదన్నారు. రైతు కండువాను చూపి దేశంలో ఓట్ల కోసం వాడుకున్న నాయకులు ఉన్నారన్నారు. రాజకీయాల్లో బొడ్డూడని వాడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు పోతున్నాం కరెంటు ఇడవమని కోరే పరిస్థితులు ఉండేవని కేటీఆర్ అన్నారు. 

గల్లా ఎగరేసి చెప్పొచ్చు 

"కరెంటు, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కోసం తండ్లాడినం. నేడు వరి ధాన్యం ఉత్పత్తిలో నేడు నల్లగొండ జిల్లాది అగ్రస్థానం. తెలంగాణ రాష్ట్రంలో ఇది సాధ్యమయిందని గల్లా ఎగరేసి చెప్పొచ్చు. నాడు కరెంటు ఉంటే వార్త నేడు కరెంటు పోతే వార్త. 24 గంటల కరెంటు ఇస్తే గొప్పనా అంటున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో చూపే దమ్ము విపక్షాలకు ఉన్నదా? 2014లో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు  నేడు వరి ధాన్యం ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరుకున్నది.  నాడు 35 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే నేడు 65 లక్షల బేళ్లకు చేరుకున్నది. స్వాతంత్ర్య భారతదేశంలో రైతుబంధు ఇవ్వాలని అలోచన చేసిన ఏకైక నేత కేసీఆర్.  రైతుబంధు పథకం కింద రూ.68 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. రైతు బీమా కింద రూ.5 లక్షల జీవిత బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. "- మంత్రి కేటీఆర్ 

ధాన్యం కొనుగోళ్లు ప్రైవేటీకరణ 

24 గంటల ఉచిత కరెంటుకు ఏటా రూ.10,500 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ 2014లో అధికారం ఇస్తే రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నారు కానీ వేలు, లక్షల రెట్లు ఆదాయం పెరిగింది ఒక్క అదానీకి మాత్రమే అని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్కడు ధనవంతుడైతే ప్రజలు ధనవంతులు కారన్నారు. పల్లె జీవితాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలను బలోపేతం చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉచిత చేప పిల్లలతో తెలంగాణ మత్స్యసంపద దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కోటి 35 లక్షల ఎకరాలలో సాగు తెలంగాణకు గర్వకారణమన్నారు. పుట్ల కొద్దీ తెలంగాణ రైతులు ధాన్యం పండిస్తే కొనలేక కేంద్రం చేతులు ఎత్తేసిందని ఆక్షేపించారు.  నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి వడ్లు కొనం తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పమని కేంద్ర మంత్రి అవహేళన చేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రైతుల చైతన్యాన్ని మోదీ తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. మోటార్లు మీటర్లు పెట్టాలని మోదీ అన్నారని, తన గొంతులో ప్రాణం ఉండగా బాయికాడ మీటర్లు పెట్టనని కేసీఆర్ అన్నారన్నారు. ప్రీ పెయిడ్ మీటర్లు రైతాంగానికి గొడ్డలిపెట్టు అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రైవేటుకు కొనుగోళ్లు అంటే మన మరణ శాసనం మనం రాసుకున్నట్లే తీవ్రంగా స్పందించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Embed widget