అన్వేషించండి

Bandi Vs TRS : బండి సంజ‌య్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవ‌రు? రైతులా? టీఆర్ఎస్ కార్యక‌ర్తలా?

వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఇంతకీ వడ్లు కొనాల్సింది ఎవరు ? బండి సంజయ్‌ను అడ్డుకుంటున్నది ఎవరు ?

రెండు రోజుల ఉమ్మడి న‌ల్గొండ జిల్లా ప‌ర్యట‌నలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ను అడుగ‌డునా అడ్డుకుంటున్నది ఎవరు ? ఎందుకోసం ? .  ధాన్యం కేంద్రం కొనాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం కొనాలని టీఎస్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. యాసంగిలో వరి వేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పుడు చేతికొచ్చిన పంటను మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం పంటను కొంటాం అని చెబుతుంది. కానీ రోజుల త‌ర‌బ‌డి రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంట‌ర్లు, కొనుగోలు కేంద్రాల వ‌ద్దే ఉంచుతున్నారు. తేమ ఉంద‌ని, టోకెన్లు ఇచ్చాం ఇంకా మీ టైం రాలేద‌ని  అధికారులు చెబుతున్నారు. మ‌రోవైపు కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అస‌లు వడ్లు అమ్మడానికే రైతులు రావ‌డంలేదు. మ‌రికొన్ని చోట్ల మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
Bandi Vs TRS : బండి సంజ‌య్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవ‌రు? రైతులా? టీఆర్ఎస్ కార్యక‌ర్తలా?

Also Read : రంగమైన బండి సంజయ్ పర్యటన.... అడుగడుగునా అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు...

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల బాధలు పరిశీలిస్తానని బండి సంజయ్ పర్యటనలు ప్రారంభించడంతోనే వివాదం ప్రారంభమయింది. గ‌త వారం ప్రెస్ మీట్లతో ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకున్న టీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగి ఒక‌రిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొదటి రోజు టూర్‌లోనే బండి సంజ‌య్ కాన్వాయ్ లోని వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంది టీఆర్ఎస్ కార్యక‌ర్తలు, నాయ‌కులే అని బీజేపీ అంటోంది. కేసిఆర్, కేటిఆర్, మంత్రుల అదేశాల‌ మేర‌కే త‌మ‌పై ప‌థ‌కం ప్రకారం దాడి జ‌రుగుతోంద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి గవర్నర్‌కే ఫిర్యాదు చేశారు.
Bandi Vs TRS : బండి సంజ‌య్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవ‌రు? రైతులా? టీఆర్ఎస్ కార్యక‌ర్తలా?

Also Read: సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్... కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదు... మంత్రి కేటీఆర్ కామెంట్స్

టీఆర్ఎస్ మాత్రం దాడి చేస్తోంది రైతులేనని చెబుతోంది. త‌మ వ‌ద్దకు బీజేపీ నేత‌లు రావ‌ద్దని అంటున్నార‌ని టీఆర్ఎఎ్ నేత‌లు అంటున్నారు. అయితే ధాన్యం అమ్మకోవాల‌ని కొనుగోలు కేంద్రాల వ‌ద్దకు వ‌చ్చే రైతుల వ‌ద్ద కోడిగుడ్లు, ట‌మాటాలు, రాళ్లు ఉంటాయా? అనేది ప్రశ్న. మ‌రోవైపు ఈ దాడి - ప్రతి దాడుల‌కు కొన‌సాగింపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శలు చేసుకుంటున్నారు. తాము నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపితే బీజేపీ నేత‌లు రెచ్చగొట్టార‌ని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. 

Also Read:  కేసీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు? అన్నీ డ్రామాలే.. ఆ విషయం ఒప్పుకున్నట్లేగా..

అస‌లు ధాన్యం కొననంటోంది ఎవరు ? అనే క్లారిటికీ రైతులు వ‌స్తున్నట్లు క‌న్పిస్తోంది.  క్షేత్రస్థాయిలో బీజేపీ నేత‌లు వెళ్లి అస‌లు వానాకాలం పంటను ఎందుకు కొన‌డంలేదు అనే విష‌యాన్ని రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విష‌యం రైతుల్లో చర్చ జరిగే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోది. అదే సమయంలో ప్రభుత్వానిది దళారి పాత్రనేనని పండించేది రైతులయితే కొనేది కేంద్రమని కూడా చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు యాసంగి పంట చేతికొచ్చిన తర్వాత బీజేపీ నేతలు వచ్చి పంట కొంటారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి  ఈ అంశంపై అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఇటు కేంద్రంలో అధికారంలో బీజేపీ రైతుల్ని గందరగోళ పరిచి రాజకీయం చేస్తున్నాయి. 

Also Read: రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget