అన్వేషించండి

RS Praveen Kumar: పేదల భూములను లాక్కోవడానికే ధరణి, మోసం చేయడానికే దళితబంధు పథకం

ఆంధ్ర నుండి వచ్చిన దోపిడీ పాలకులు తెలంగాణ బహుజన బిడ్డలను చంపుతామని బెదిరిస్తున్నాడంటే ఇంకా తెలంగాణ రాలేదని అన్నారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్ (టి) నియోజకవర్గాన్ని తెలంగాణలో విలీనం చేయడానికి ఈ బహిరంగ సభ జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గం ఇంకా ఆంధ్ర వలసవాదుల కబ్జాలోనే ఉందన్నారు. 2008లో తుమ్మిడిహట్టి దగ్గర అప్పటి సిఎం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో భూములు లాక్కొని, కొందరికి పరిహారం కూడా ఇవ్వకుండా 1500 కోట్లు ఖర్చు చేశారు. ఆ కాంట్రాక్టు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇచ్చారని గుర్తుచేశారు. పైగా ప్రాజెక్టు నిలిపివేసి కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 82వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్రవారికే అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికి కూడా క్రషర్లు, కంకర క్వారీలు పెట్టి, రోడ్ల కాంట్రాక్టుల పేరుతో 50 కోట్లు ఆంధ్రకు చెందిన వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్ కి అప్పజెప్పారని విమర్శించారు. ఆంధ్ర నుండి వచ్చిన దోపిడీ పాలకులు తెలంగాణ బహుజన బిడ్డలను చంపుతామని బెదిరిస్తున్నాడంటే ఇంకా తెలంగాణ రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములను లాక్కోవడానికే ధరణి తీసుకొచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సీఎస్ కూడా ఆంధ్రావారే ! 
తెలంగాణకు చెందిన బహుజన బిడ్డలకు ఉన్నత పదవులు ఇవ్వకుండా ఇటీవల చీఫ్ సెక్రటరీ పదవి ఆంధ్రవారికి కట్టబెట్టిన తెలంగాణ వ్యతిరేకి కేసిఆర్ అని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు సిర్పూర్ నియోజకవర్గంలో అటవీ అధికారిణిపై దాడి చేస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అడ్డగూడూరులో దొంగతనం ఆరోపణలు వస్తే అరెస్టు చేసిన పోలీసులు, వందకోట్ల లిక్కర్ స్కాం చేసిందని ఆరోపణలు వచ్చిన కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. కోయపోచగూడేంలో పోడు భూమి సాగు చేసిన మహిళలను బట్టలు ఊడిపోతున్నా దాడి చేశారని, పోడు భూముల విషయంలో ఓ బాలింతలను సైతం అరెస్టు చేశారని, అదే పేదల భూములు, నోటిఫైడ్ భూములు కబ్జా చేసినవారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.

ప్రజలు మీకు విఆర్ఎస్ ఇవ్వనున్నారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు బీబ్రా గ్రామంలో జాతీయజెండా ఎగురవేసిన విధంగా, అదే స్పూర్తితో 2023లో నీలిజెండా ఎగురవేసి కోనప్ప నుండి విముక్తి కల్పిస్తామని తెలిపారు. సిర్పూర్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్, బిఆర్ఎస్ అంటూ ఎన్ని పెట్టినా ప్రజలు మీకు విఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కాలుష్యం ప్రజలకిస్తూ లాభాలు మాత్రం కంపెనీ,పాలకులు పంచుకుంటున్నారని ఆరోపించారు. బహుజన రాజ్యంలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తెలిపారు. మన బహుజన బిడ్డలు కాంట్రాక్టర్లు, యజమానులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కావాలంటే మన రాజ్యం రావాలన్నారు. జి.వో నెం 317 వల్ల ఆసిఫాబాద్ యువత తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
బిసిలకు గత ఎనిమిది ఏళ్లుగా బడ్జేట్ లో కేవలం 2వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. విద్యార్థులకు కనీసం ఫీజ్ రియంబర్స్ మెంట్  కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఫాంహౌస్ పంటలకు ఒక ధర, పేదల భూముల్లో పండిన పంటలకు ఇంకో ధర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు బండి సంజయ్ ఇవన్ని పట్టించుకోకుండా కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతూ,మసీదులు తవ్వాలంటున్నారని విమర్శించారు. ఇలాంటి మాటలతో హిందూ ముస్లిం తెహజీబ్ చెడగొట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
కెసిఆర్ జీతాలే ఇవ్వడం లేదు..
దళిత బంధు పథకం రాష్ట్రంలో అందరికి రావాలంటే రెండు లక్షల కోట్ల బడ్జెట్ కావాలని, కానీ కెసిఆర్ జీతాలే ఇవ్వడం లేదని, బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా నేడు సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కాగజ్‌నగర్‌ లోని సర్సిలా, శిశుమందిర్ స్కూల్ వెనకగల డంపింగ్ యార్డుకు సంబంధించిన 9 ఎకరాల భూమి కెటిఆర్ మంత్రి అండదండతో కోనేరు కోనప్ప కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారన్నారు. 2015లో మున్సిపాలిటీకి కేటాయించిన భూమిని నేడు అక్రమంగా ఆక్రమించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కెటిఆర్ నీకు దమ్ముంటే నీవు తెలంగాణ వాదివి అయితే ఆంధ్ర దొంగల నుండి ప్రభుత్వ భూమి కాపాడాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రైవేట్ ఎస్టేట్ కాదన్నారు. వెంటనే కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రియంబర్స్ మెంట్ రావాలంటే, రైతుల పంటకు మద్దతు ధర రావాలన్నా,కౌలు రైతులకు న్యాయం జరగలన్నా మన రాజ్యం రావాలని తెలిపారు.

తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలు నెరవేరలేదన్నారు. కాగజ్‌నగర్‌  బహిరంగసభలో భాగంగా బియాని అపార్ట్ మెంట్స్ కాలనీ నుండి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించి, స్టేజి మీద గల మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులార్పించి బహుజనగీతం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, బిఎస్పి ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మోర్ల గణపతి, నియోజకవర్గ సెక్రటరీ దుర్గం ప్రవీణ్, నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్, నాయకులు రాంటెంకి నవీన్, జ్యోతి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Nandamuri Balakrishna: ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP DesamAniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Nandamuri Balakrishna: ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
ఆ మాట మాట మన ఒంటికి పట్టదు... పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చిందనే కామెంట్స్‌పై బాలయ్య రియాక్షన్
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Vaishnavi Chaitanya: కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
కోటి రూపాయలు కామన్... ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన వైష్ణవి చైతన్య!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
Embed widget