అన్వేషించండి

Basara IIIT: ఆదివారం గవర్నర్ వెళ్లారు - సోమవారం నుంచి కరెంట్ కట్, అంధకారంలోనే బాసర ట్రిపుల్ ఐటీ

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నే రాష్ట్ర గవర్నర్ విద్యార్థుల సమస్యల వినగా.. తాజాగా నిన్న మధ్యాహ్నం నుండి ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సమస్య తలెత్తింది.  

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ కొన్ని రోజుల నుంచి ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు వర్సిటీ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ రోజుల తరబడి విద్యార్థులు నిరసన చేయగా.. సమస్యలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. రోజూ ఏదో ఒక సమస్యపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యహ్నాం 12 గంటల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

క్యాంటీన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్లు.. 
కరెంటు లేక, రోజంతా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. క్యాంటీన్ లో క్యాండిల్స్ పెట్టుకుని అదే వెలుతురు మధ్యలో విద్యార్థులు భోజనం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. పగలు 12 గంటలకు పోయిన కరెంటు అర్ధరాత్రి అయినా రాలేదు. రోజు దాటినా విద్యుత్ సరఫరా లేకపోవడం విద్యార్థులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద సమస్య ఉందని అధికారులు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి లోపు కరెంటు సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కానీ విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. అయితే క్యాంపస్ లో భారీ సోలార్ ప్లాంట్ ఉన్నప్పటికీ అది నిరుపయోగంగా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

గవర్నర్ వెళ్లి వచ్చిన మరుసటి రోజే మరో సమస్య 
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారం రోజు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడి విద్యార్థులతో క్యాంపస్, వారి సమస్యలపై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై.. విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచించారు. అమ్మాయిల భద్రత విషయలో సమస్య ఉన్నట్లు తెలిసిందని.. సిబ్బంది కొరతా తీరుస్తామని... ఇవాళ్టి నుంచి ఒక్కొక్క సమస్య తీరుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. అయితే గవర్నర్ ఆదివారం క్యాంపస్‌కు వెళ్లగా.. మరుసటి రోజు నుంచి మరో సమస్య విద్యార్థులను వేధించడం ప్రారంభించింది. 

మాటిచ్చి నిలబెట్టుకున్న గవర్నర్.. 
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలపై ఇటీవలే గవర్నర్ తమిళి సై ని కలిశారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చాలా రోజుల నుంచి తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని గవర్నర్ కు చెప్పారు. వాటిని పరిష్కరించాలని ఆందోళన చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేవని గవర్నర్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి రావాలని విద్యార్థులు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కోరారు. విద్యార్థుల కోరిక మేరకు తప్పకుండా ట్రిపుట్ ఐటీకి వచ్చి సమస్యలను పరిశీలిస్తానని ఆనాడు గవర్నర్ మాట ఇచ్చారు. తప్పకుండా వస్తానని హామీ మేరకు గవర్నర్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ కి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. 

కరెంటు కోతలపై ఆగ్రహం..  
బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కరెంటు కోతలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో చదువులు సాగించేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కరెంటు లేకపోవడంతో సెల్ ఫోన్ వెలుతురులోనే రాత్రంతా గడిపామని, ఆహారం తినేందుకు క్యాండిల్ వినియోగించామని వాపోతున్నారు. విద్యార్థుల వసతి గృహాలు అంధకారంలోనే ఉన్నాయని, తమ సమస్యలు త్వరగా తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget