అన్వేషించండి

Nizamabad వరి పంట వైపే మొగ్గుచూపుతున్న జిల్లా రైతులు

వరి పంటకు సర్కార్ నై అన్నా.... అన్నదాతలు సై అంటున్నారు. జిల్లా మెజార్టీ రైతులు వరి సాగుకే మొగ్గు. భూమి గుణం పట్టి వరికే జై కొడుతున్న కర్షకులు. విత్తన కల్తీతో ఇతర పంటలకు వెళ్లలేమంటున్న రైతులు.

వరి కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులు సమాయత్తం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు సూచించింది. వ్యవసాయశాఖ ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తోంది. అయినా నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ రైతులు వరి పంటకే మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్ తర్వాత రబీ సంప్రదాయంగా వరి పంటనే పండిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ముందస్తుగా చెప్పకుండా ఉన్నఫలంగా వరి పంట వేయద్దంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలా మంది రైతులు ఏ పంట వేయాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. వరికి అలవాటైన రైతులు ఇతర పంటలకు వెళ్లలేక పోతున్నారు. ఈ సారి వానాకాలంలో వర్షాలు సంమృద్ధిగా కురిశాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు సంమృద్ధిగా ఉంది. భూగర్భజలాలు పెరిగాయ్. దీంతో అధిక శాతం అన్నదాతలు వరి సాగుకే జై కొడుతున్నారు. ప్రభుత్వం ఓ వైపు వద్దంటున్నా.. రైతులు మాత్రం వినటం లేదు. 

రైస్ మిల్లర్లతో బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటే ఓకే

రైస్‌మిల్లర్లు, వ్యాపారులతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకున్న వారు ముందుకెళ్లొచ్చని సూచిస్తోంది. వ్యవసాయ శాఖ బోధన్, నిజామాబాద్ డివిజన్లలో రైతులు చెరకు వైపు మొగ్గుచూపాలని సూచిస్తోంది. గతంలో ఇక్కడ వరికి ప్రత్యామ్నయంగా చెరకు సాగు భారీగా అయ్యేది. బోధన్, సారంగపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ మూత పడటం వల్ల రైతులు పూర్తిగా చెరకు సాగుకు దూరమయ్యారు. గతంలో దాదాపు 2 లక్షలకుపైగా ఎకరాల్లో చెరకు పండించే వారు రైతులు. ప్రస్తుతం కనీసం 200 ఎకరాల్లో కూడా చెరకు పండించటం లేదు. ఈసారి ఎలాగైనా రైతులతో 7 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీలతో ఒప్పందం కుదుర్చుకుని చెరకు సాగుకు వెళ్లాలని సూచిస్తోంది వ్యవసాయ శాఖ. అయితే బోధన్, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తే వరికి ప్రత్యామ్నయంగా చెరకు సాగుకు వెళ్తామంటున్నారు రైతులు.

మరోవైపు సన్ ప్లవర్ పంట సాగు వైపు మొగ్గు చూపాలంటోంది జిల్లా వ్యవసాయ శాఖ. 3 నెలల పంట. మద్దతు ధర కూడా బాగుంటుందని చెప్పున్నప్పటికీ ఈ పంటకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. నిత్యం 10 మంది కూలీలు అవసరం ఉంటుందని... నాణ్యమైన విత్తనాలు ఉంటేనే పంట దిగుబడి వస్తుందని అభిప్రాయపడుతున్నారు రైతులు. మార్కెట్ నకిలీ విత్తనాలే చెలామణి అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. 2005కు ముందు జిల్లాలో సన్ ఫ్లవర్ సాగు కూడా రైతులు ప్రాధాన్యం ఇచ్చేవారు. తిరిగి ఆ పంటవైపు వెళ్లాలని అధికారులు సూచిస్తున్న ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు.

అయోమయంలో అన్నదాతలు

అసలు ఏ పంట వేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు చాలా మంది రైతులు. ప్రభుత్వం రైతు బంధు ఎకరానికి 15 వేలు ఇస్తే యాసంగిలో పంట విరామం ప్రకటిస్తామని కొందరు రైతులు అభిప్రపాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటవైపు వెళ్తే కోతుల బెడద ఎక్కువగా ఉంటుందని కొందదరు రైతులు అభిప్రాయపడుతున్నారు. వాటి బెడద తొలగడం లేదు. వాటి తాకిడి ఉన్నంత వరకు ఇతర పంటలు వేయలేమంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఈసారి చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయ్. జల వనరులు పుష్కలంగా ఉన్నాయ్. దీంతో కొన్నేళ్లుగా బీడుగా ఉన్న భూముల్లో సైతం రైతులు చదును చేసి వరి పంట పండించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం మొక్కజొన్న వైపు వెళ్తున్నారు. గతంలో సోయా పంట సాగు చేసినప్పటికీ నకిలీ విత్తనాల వల్ల దాదాపు లక్ష ఎకరాల్లో సోయా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు సోయా సాగు చేద్దామంటే భయపడుతున్నారు. ఇక ఉల్లి, ధనియాలు, పత్తి, సజ్జలు, కూరగాయలవైపు కూడా కొంత మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో చాలా మంది రైతులు ఎక్కువగా వాణిజ్యపంటలవైపే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ వరి తక్కువగానే పండిస్తున్నారు. అధికంగా పసుపు, మొక్కజోన్న, ఎర్రజోన్న, సజ్జలు, ఉల్లి, కూరగాయలు పండిస్తున్నారు. అయితే మెజార్టీ రైతులు మాత్రం వరి సాగుకే సిద్ధమయ్యారు. ఏదైనా కానీ ఈ సారి యాసంగికి వరినే పండిస్తామని మెజార్టీ అన్నదాతలు ముందుకొస్తున్నారు. 

Also Read: TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..

Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్

Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?

Also Read: Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Basara Temple Master Plan: రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Granny OTT : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Donald Trump: ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Embed widget