అన్వేషించండి

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న కరోనా.. వారికి థర్డ్ వేవ్ ముప్పు తప్పదా ?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి. క్రితం రోజుతో పోల్చితే జిల్లాలో రెట్టింపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయ్. నిజామాబాద్ జిల్లాలో గురువారం 60 మందికి కరోనా సోకగా.. కామారెడ్డిలో 14 మంది కొవిడ్ బాధితులుగా మారారు. క్రితం రోజుతో పోల్చితే రెట్టింపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి తరువాత కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్ ఒకటి.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ బాధితులు, కాంటాక్ట్ అయిన వ్యక్తులు, అనుమానిత వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది.  సామాన్య ప్రజలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు మహమ్మారి భారిన పడుతున్నారు. ప్రతిరోజూ జిల్లాలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఒకరికి కరోనా సోకిందంటే అతని ద్వారా కుటుంబ సభ్యుల్లోని వారికి వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో తీవ్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికి కరోనా సోకిందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది బాధితులు లక్షణాలు లేకుండా వ్యాధి భారిన పడుతుండడమే దీనికి ప్రధాన కారణం. ఆయా ప్రాంతాల్లోని పలు స్వచ్ఛంధ కమిటీలు, కాలనీల సభ్యులు, ప్రజలు వైరస్‌ విస్తరించకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

ఇంట్లోని వ్యక్తులు బయటకు వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా మాస్క్‌ ధరించాలని సూచించడంతో పాటు తప్పనిసరిగా శానిటైజర్‌ వినియోగించేలా దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు యువతతో పాటు ఆయా వర్గాల్లో ప్రాణాపాయస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో రెండోవేవ్‌ ప్రారంభ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీస మాస్క్‌ కూడా ధరించకుండా విచ్చలవిడిగా సంచరించిన సందర్భాలు ఉన్నాయి. రెండో వేవ్‌లో పెద్దఎత్తున రోజుల వ్యవధిలోనే వైరస్‌ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన రేపుతున్న కరోనా థర్డ్‌వేవ్‌ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, జాగ్రత్తలు పాటించకపోయిన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇది స్థానిక ప్రజల్లో మరింత ఆందోళన కల్గిస్తోంది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పీహెచ్‌సీ స్థాయిలో అనుమానితులకు ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మరోవైపు, పాజిటివ్‌ వచ్చిన ఇంట్లోనే కొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొంచి ఉన్న ప్రమాదం రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ త్వరగా విస్తరిస్తోందని రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.

వచ్చే నాలుగైదు వారాలు వైరస్‌ ఉధృతి మరింత పెరుగుతుందని హెచ్చరించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వ్యాధిని కట్టడి చేసేందుకు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, తీవ్రతను తగ్గించాలంటే కొవిడ్19 నిబంధనలు పాటించడంతో పాటు జాగ్రత్తలు తప్పనిసరని  వైద్యాధికారులు చెబుతున్నారు. భౌతికదూరం, ముఖానికి మాస్క్‌ వ్యక్తిగత శుభ్రత, శానిటైజేషన్‌ను తప్పనిసరిగా పాటిస్తూ స్వీయరక్షణ చర్యలు పాటించాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాల శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారు వైరస్‌ భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: Bhogi Wishes in Telugu: భోగ భాగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 84,280 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2707 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 20,462 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 582 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,78,290కి చేరింది. 

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! నేడు ఎగబాకిన పసిడి ధర.. అతి భారీగా పెరిగిన వెండి రేటు.. ఇవాళ ఇలా..

Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget