అన్వేషించండి

కామారెడ్డిలో మాస్టర్‌ప్లాన్ మంటలు- రైతులతో కలిసి కాంగ్రెస్‌ ధర్నా- బండి ఇంటి చుట్టూ పోలీసులు

కామారెడ్డిలో మాస్టర్‌ ప్లాన్ మంటలు తీవ్రమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులు చేపట్టే బంద్‌కు మద్దతు ప్రకటించారు.

కామారెడ్డిలో మాస్టర్‌ ప్లాన్ మంటలు తీవ్రమయ్యాయి. రైతుల బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఆ పార్టీ సీనియర్ లీడర్‌ షబ్బీర్ అలీ రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి కూడా నేతలు, రైతులు యత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను, నేతలను అడ్డుకున్న పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. 

ధర్నాను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా కామారెడ్డి వస్తారని తెలిపారు. ఈ రైతుల ఆగ్రహాన్ని తట్టుకోలేమని గ్రహించిన ప్రభుత్వం ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని హర్డిల్స్ దాటుకొని మూడు వాహనాలు మారుతూ తాను కామారెడ్డి చేరుకున్నట్టు షబ్బీర్ అలీ తెలిపారు. 

రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు షబ్బీర్ అలీ. మంత్రి కేటీఆర్ స్పందించినా కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాత్రం బయటకు రాలేదన్నారు. వినతిపత్రం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కిసాన్ సర్కారు కాదని... కసాయి సర్కారుగా బీఆర్ఎస్ మారింది ఆరోపించారు. పోలీస్ జులుం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మాస్టర్ ప్లాన్ ఆఫీస్ దిక్కు లేదని... ప్రభుత్వం కానీ, లోకల్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా స్పందించడం లేదన్నారు. 

ఇండస్ట్రియల్‌ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాలకు భూములు తీసుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. భూములను అమ్ముకుంటు 20 వేల కోట్ల వరకు వసూలు చేయాలని చూస్తున్నారన్నారు. తక్షణమే కేటీఆర్ స్పందించి అఫీషియల్ గా ప్రకటించాలి ఈ విషయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నుంచి ప్రకటన వచ్చే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని... ప్రతి జిల్లాలో మాస్టర్ ప్లాన్‌తో రియల్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. పోరాటం ప్రారంభం కాగానే భూములు పోవని కేటీఆర్ కానీ, ఎమ్మెల్యే కానీ చెప్పలేదన్నారు. 

మరోవైపు ఈ మాస్టార్ ప్లాన్‌లో భూములు కోల్పోతాయని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ బయల్దేరనున్నారని సమాచారం. ముందు జాగ్రత్తగా ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆయన్ని వెళ్లనీయకుండా అడ్డుకునేందుకే పోలీసులు బండి ఇంటిని చుట్టుముట్టారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Rythu Bharosa Funds Release 2026:తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Embed widget