అన్వేషించండి

Asifabad News: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ, నేడు బీజేపీలోకి చేరిక 

Telangana News: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) జడ్పీటీసీ నీరేటి రేఖ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజే బీజేపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. 

Asifabad News: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) జడ్పీటీసీ సభ్యురాలు నీరేటి రేఖ, ఆమె భర్త జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ నీరెటి సత్యనారాయణ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సిర్పూరు(టి)లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానిక నాయకుడి మాటలు విని మండల అభివృద్ధిని విస్మరిస్తుననారని ఆరోపించారు. సిర్పూర్ (టీ) మండల కేంద్రానికి మంజూరైన ఎమ్మేల్యే క్వార్టర్ నీ కాగజ్ నగర్ పట్టణానికి తరలించారని ఆరోపించారు. సిర్పూర్ (టి) కి మంజూరైన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను సైతం పురపాలిక పరిధిలో ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. మండల అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఇక్కడ కనీసం బస్టాండ్ సౌకర్యం కూడా లేదన్నారు. ఎమ్మెల్యే చూపుతున్న వివక్ష కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరతామని ప్రకటించారు. నీరేటి రేఖ 2014 నుంచి 2018 వరకు సిర్పూరు(టి) మండల ఎంపీపీగా 2018 నుంచి జడ్పీటీసీ సభ్యురాలు కొనసాగుతున్నారు. 


Asifabad News: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ, నేడు బీజేపీలోకి చేరిక 

నేడే బీజేపీలో చేరబోతున్న జడ్పీటీసీ సభ్యురాలు నీరేటి రేఖ

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ సభ్యురాలు నీరేటి రేఖ, సత్య నారాయణ దంపతులు భాజపాలో చేరేందుకు హైదరాబాద్ కు బయల్దేరారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ముందుగా సిర్పూర్ (టీ) మండలంలోని టోంకిని సిద్ది హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి, బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిర్పూర్ టౌన్ లోని బస్టాండ్ చౌరస్తాలో కాగజ్ నగర్ లోని ప్రధాన కూడళ్లలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా వెనక్కి నెట్టిన ఘనత కోనేరు కొన్నపకే దక్కిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి చిరునామా కల్వకుంట్ల కుటుంబం అయితే సిర్పూర్ (టీ) నియోజకవర్గంలో దోపిడీకి చిరునామా కోనేరు కుటుంబమని విమర్శించారు. 


Asifabad News: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సిర్పూర్(టి) జడ్పీటీసీ, నేడు బీజేపీలోకి చేరిక 

రాబోయే రోజుల్లో సిర్పూర్ (టీ) నియోజవర్గం విముక్తి పోరాటంలో జడ్పీటిసి సభ్యురాలు నీరటి రేఖ - సత్యనారాయణ దంపతుల మాదిరిగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో సిర్పూర్ (టి) నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల నుండి ఖాళీ అవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఖాళీ అవుతుందని తెలిపారు. సిర్పూర్ లో బిజేపి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల భాజపా అధ్యక్షులు ఎల్ములే శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరక్టర్ నీరెటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, నాయకులు కొండ్ర మనోహర్ గౌడ్, రాచర్ల మహేష్ యాదవ్, దంద్రే శంకర్, చౌదరి భగవాన్, ఉప్పుల వెంకట్శ్వర్, మైదం తిరుపతి, మేకల తిరుపతి, మేకల వెంకటేష్, అశోక్ ఆచార్య గురూజీ, జాగరి రమేష్, సాయి బనార్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget