అన్వేషించండి

Narayanpet Violence: మహిళకు ఫుల్లుగా మద్యం తాగించారు.. ఆపై ఊహించని దారుణం..

ఓ మహిళకు ఫూటుగా కల్లు తాగించి ఇద్దరు వ్యక్తులు ఆమెను చంపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆమెను హత్య చేసినందుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మహిళకు ఫూటుగా మద్యం తాగించి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన నారాయణపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ మహిళను అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని మాయం చేసేందుకు శత విధాలా ప్రయత్నించారు. చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసిపోవడంతో నిందితులు దొరికిపోయారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నారాయణపేట పట్టణంలోని బీసీ కాలనీలో కర్రెమ్మ అనే 45 ఏళ్ల మహిళ నివాసం ఉంటోంది. ఈమె ఆ ప్రదేశంలోనే కాగితాలు, పాత ఇనుప సామాన్లు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 5వ తేదీన ఉదయం కర్రెమ్మను అదే కాలనీలో నివాసం ఉండే నరేశ్, నారాయణ అనే వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకుని ఊట్కూర్‌ మండలంలోని తిప్రాస్‌ పల్లికి ముగ్గురూ కలిసి వెళ్లారు. 

ఆ ఊరిలో ఉన్న కల్లు దుకాణంలో కర్రెమ్మకు ఫూటుగా కల్లు తాగించి, వారూ కూడా పీకలదాకా తాగారు. అనంతరం ఆ గ్రామ శివారుకు చేరుకున్నవారు మహిళతో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు కర్రెమ్మను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితులు ఆ మృత దేహాన్ని ఎలాగైనా మాయం చేయాలనుకొని పాడుపడిన నిర్మాణంలో కట్టెలు వేసి దహనం చేసేయాలని ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో శవాన్ని ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి మోడాల్‌ వంతెన కింద వేసేశారు. తిరిగి వారిద్దరు నిందితులు గుట్టుచప్పుడు కాకుండా బైక్‌పైనే నారాయణపేటలోని ఇళ్లకు చేరుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలియని కర్రెమ్మ పెద్ద కుమారుడు మారెప్ప శుక్రవారం తన తల్లి కోసం చాలా చోట్ల వెతికాడు. బంధువుల ఇళ్ల వద్ద కూడా వాకబు చేశాడు. ఎక్కడా ఆమె జాడ తెలియకపోవడంతో చేసేది లేక, కాలనీవాసుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. 

ఈ విచారణలో కర్రెమ్మను హత్య చేసింది తామేనని ఇద్దరూ అంగీకరించారు. వారు తెలిపిన వివరాల మేరకు నారాయణపేట సీఐ నేతృత్వంలో పోలీసుల టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే, అరెస్టు చేసిన నిందితులను తమకు అప్పగించాలని బాధిత మహిళకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద డిమాండ్ చేశారు. అయితే, ఇవ్వడం కుదరదని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో అందరూ వెనుదిరిగారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget