అన్వేషించండి

Munugodu Bypolls 2022: కాంగ్రెస్ తరఫున ఎంపీ వెంకటరెడ్డి ప్రచారం చేస్తారా, తమ్ముడ్ని ఓడించేందుకు సిద్ధమా !

తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసిన మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఎంపీ వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. అన్ని పార్టీలు గ్రామాల్లో తమ నాయకులను నియమించి ప్రచారం మొదలుపెట్టేశాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రధాన చర్చ సాగేది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనే. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన తమ్ముడి కోసం పనిచేస్తారా..? లేక సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌ విజయం కోసం పనిచేస్తారా..? అనే విషయంపై చర్చ నడుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శైలి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి అంతు చిక్కడం లేదు.

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో కొందరు నాయకులు అన్న వెంకటరెడ్డిపై కూడా విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ విషయంపై కాస్త సద్దుమణిగినట్లే కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలపై ప్రియాంకా గాంధీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఆమె నేరుగా వెంకటరెడ్డితో మాట్లాడటం, ఆ తర్వాత ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్లేనని అందరూ బావించారు.

పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు ఎంపీ వెంకటరెడ్డి. ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రలో వెంకటరెడ్డి పాల్గొనడంతో వెంకటరెడ్డి మునుగోడుపై దృష్టి సారిస్తారని అంతా భావించారు. అయితే అక్కడ పాదయాత్రలో పాల్గొన్న వెంకటరెడ్డి మాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. మరోవైపు భారత్‌ జోడో యాత్ర సన్నాహక సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టడం చూస్తే రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండేందుకు సిద్దమయ్యారని గమనించవచ్చు.  
తాను సూచించిన అభ్యర్థికి న్యాయం చేస్తాడా..?
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ కోసం నలుగురు పోటీ పడ్డారు. ఈ విషయంపై అధిష్టానానికి కోమటిరెడ్డి సూచించిన పాల్వాయి స్రవంతికే టిక్కెట్‌ లబించింది. వెంకటరెడ్డి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనే మునుగోడు ఉండటంతోపాటు ఆయనకు ప్రాధాన్యత కల్పించాలనే విషయంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన మాటకే విలువిచ్చింది. ఈ క్రమంలో అభ్యర్థిగా ఉన్న పాల్వాయి స్రవంతి సైతం వెంకటరెడ్డిని కలిసి ప్రచారానికి రావాల్సిందిగా అభ్యర్థించారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత తాను ప్రచారానికి వస్తానని వెంకటరెడ్డి చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నోటిపికేషన్‌ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారా..? లేదా..? అనేది మునుగోడు కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చ సాగుతుంది.

తాను సూచించిన అభ్యర్థికే మునుగోడు టిక్కెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానానికి మునుగోడులో పార్టీని గెలిపిస్తారా..? లేక సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పరోక్షంగా పని చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది. మరోవైపు వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారని పాల్వాయి స్రవంతి చెబుతునప్పటికీ ఆయన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చూస్తే అసలు ఇంతకీ వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీలు చేరికలతో బీజీగా మారడంతో వెంకటరెడ్డి ప్రచారానికి వస్తే మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 

వీడియోలు

Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Embed widget