అన్వేషించండి

Komatireddy: మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు... పుణ్యస్నానం ఆచరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

TG Minister: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మహాకుంభమేళాకు హాజరయ్యారు. ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానాలు చేసిన ఆయన తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

Kumbha Mela: ప్రపంచంలోనే  అతిపెద్ద ఆధ్యాత్మిక కలయిక మహాకుంభమేళా(Kumbh Mela)కు  భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సామాన్య భక్తులతోపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రితోపాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు సైతం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
 
మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy)  ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. మహా కుంభమేళాకు వెళ్లిన ఆయన...ఆ ఆధ్యాత్మిక శోభ చూసి  భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చినా  ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు  ఆయన కొనియాడారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో స్నానమాచరించడం  ఓ అదృష్టంగా భావిస్తున్నట్లు  ఆయన తెలిపారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే  ఇలాంటి అదృష్టం వస్తుందన్నారు. పవిత్ర సంగమంలో  పుణ్యస్నానాలు చేసిన ఆయన ఇటీవల తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాక తెలంగాణ (Telangana)నుంచి చాలామంది రాజకీయ ప్రముఖులు మహాకుంభమేళాకు వెళ్లారు. ఇటీవలే మాజీమంత్రి హరీశ్‌రావు సైతం సతీసమేతంగా  పుణ్యస్నానాలు చేశారు. బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగిందని...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో  ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగిందన్నారు.. 
 
12 ఏళ్లకు ఓసారి
ప్రయాగ్‌రాజు(Prayagraj),హరిద్వార్, ఉజ్జయిని,నాసిక్‌లో  ప్రతి 12 ఏళ్లకు  ఒకసారి  మహాకుంభమేళా జరుగుతుంది. అయితే వీటన్నింటిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగే  మహాకుంభమేళానే  అత్యంత విశిష్ఠమైనది. కోట్లాది మంది భక్తులు ఈ మహాసంబరంలో పాల్గొంటారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేలా ఫిబ్రవరి 26 వరకు  కొనసాగుతుంది. సాధారణ భక్తులతోపాటు రాజకీయ ప్రముఖులు ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు. ఈనెల5 న ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi) త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేయగా...గత నెల 27న  హోంమంత్రి అమిత్‌షా(Amith Sha) గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫిబ్రవరి 1న  ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ప్రయాగరాజ్‌కు  రాగా...నేడు ద్రౌపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. మహా కుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే మౌని అమావాస్య, వసంత పంచమి రోజు భక్తులు పోటెత్తారు. ఎల్లుడి మాఘ పౌర్ణమి సందర్భంగా మరింత భక్తులు తరలిరానున్నట్లు సమాచారం. మూడో షాహీ స్నానం సందర్భంగా కోట్లాది మంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు కోల్పోవడంతో...ఈసారి అలాండి ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం(Triveni Sanghamam)లో పుణ్యస్నానాలు ఆచరించారని సమాచారం. కుంభమేళా ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరగనుంది.

ప్రత్యేక ఏర్పాట్లు
 సాధారణ భక్తులు మహాకుంభమేళాలో  కొంత ఇబ్బందులుపడుతున్నప్పటికీ, వీఐపీలు, వీవీఐపీలకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యే వసతి, భోజన సదుపాయాలు కల్పించారు.

 

 

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget