అన్వేషించండి

Singareni News: సింగరేణిలో ఆధిపత్యపోరు! సద్దుమణిగిన గొడవలో తాజాగా మరో ట్విస్ట్

సింగరేణి సంస్థలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు మరోసారి బయటకు వస్తున్నాయి. గతంలో పదోన్నతి కోసం అనేక మంది అధికారులు ఒకరిపై ఒక్కరు విమర్శలు చేసుకోగా గత ఎనిమిది నెలల నుంచి ఈ విషయం కాస్తా సద్దుమణిగింది.

తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణిలో 40 వేల మంది కార్మికులు, మూడు వేల మందికిపైగానే అధికారులు పనిచేస్తున్నారు. ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాలలోని థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు సరిపడే బొగ్గును సరఫరా చేస్తూనే మరోవైపు విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి సింగరేణి అడుగుపెట్టింది. 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితోపాటు సోలార్‌ పవర్‌ రంగంలోకి సింగరేణి సంస్థ అడుగుపెట్టింది. సింగరేణి యాజమాన్యంలో చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌తోపాటు ఐదుగురు డైరెక్టర్లు ఉంటారు. వీరితోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు డైరెక్టర్లు యాజమాన్యం బోర్డులో ఉంటారు. వీరే సంస్థకు దిశా నిర్దేశం చేస్తుంటారు.

ఏడేళ్లుగా ఇన్‌చార్జ్‌లతోనే డైరెక్టర్‌ ‘పా’ పోస్టు నిర్వహణ

సింగరేణిలో సీఅండ్‌ఎండీ తర్వాత కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే డైరెక్టర్‌ ‘పా’ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వెల్పేర్‌) పోస్టు కీలకంగా ఉంటుంది. గతంలో ఈ పోస్టులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించేవారు. అయితే ఏడేళ్లుగా సింగరేణి డైరెక్టర్‌ పోస్టు మాత్రం ఇన్‌చార్జ్‌ల నిర్వహణలోనే ఉంది. 2015లో సింగరేణి డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌ బదిలీ అనంతరం ఈ పోస్టును మిగిలిన డైరెక్టర్‌లకు ఎఫ్‌ఏసీ (ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌)గా నిర్వహిస్తున్నారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం పారదర్శకంగా పరిపాలన కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఈ పోస్టును అప్పగించేది. అయితే ఏడేళ్లుగా మాత్రం ఈ పోస్టు కేవలం ఇన్‌చార్జ్‌ల చేతులోనే ఉండటం గమనార్హం. గత ఏడాది క్రితం సింగరేణి ఫైనాన్స్‌గా బాద్యతలు తీసుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారి బలరామ్‌కు డైరెక్టర్‌ ‘పా’ పోస్టును ఎఫ్‌ఏసీగా ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన డైరెక్టర్‌ ‘పా’ బాధ్యతలు నిర్వహస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇరవైరోజుల క్రితం డైరెక్టర్‌ ఆపరేషన్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. మరో ఆరు నెలలో పదవి విరమణ చేయబోతున్న డైరెక్టర్‌కు ‘పా’ బాద్యతలు అప్పగించడం ఇప్పుడు సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది.

సమన్వయం లోపించిందా..?
సింగరేణి సంస్థకు ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్‌లు కీలకంగా పనిచేస్తారు. అయితే యాజమాన్యం బోర్డులో సమన్వయం లేకపోవడమే ఈ పోస్టుల మార్పునకు కారణంగా తెలుస్తోంది. డైరెక్టర్‌ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు నేపథ్యంలోనే పోస్టులు మార్పు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సింగరేణి సంస్థ గత ఏడేళ్ల కాలంలో ఇప్పటి వరకు చేపట్టిన రిక్రూట్‌మెంట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో జరిగిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలతోపాటు జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీ విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీనియర్‌ డైరెక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు అకస్మాత్తుగా ‘పా’ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు డైరెక్టర్ల మద్య ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్లు కార్మికులు పేర్కొంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్‌ వెలుగులు అందించడంలో కీలకంగా ఉన్న సింగరేణి సంస్థలో పారదర్శక పాలన జరిగేందుకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి డైరెక్టర్‌ ‘పా’ బాధ్యతలు అప్పగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారికి బాద్యతలు అప్పగించడం వల్ల సంస్థ పరిపాలన విభాగం పారదర్శకంగా ఉంటుందని కోరుతున్నారు. ఏడేళ్లుగా ఇన్‌చార్జ్‌ల బాధ్యతలో ఉంటున్న డైరెక్టర్‌ ‘పా’ పోస్టును ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget