అన్వేషించండి

BJP MP Laxman: ఎమ్మెల్యేలకు ఎరలో బీజేపీ పాత్ర లేదు‌‌, పార్టీకేం సంబంధం లేదు: ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందులో బీజేపీ పాత్ర ఎంత మాత్రమూ లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరమేది అధిష్టానమే నిర్ణయిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సహా.. ఏ పదవిని తాను ఆశించటం లేదని వివరించారు. గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు వస్తాయని... తాను పోటీ చేసేది లేనిదీ బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావించటం లేదన్నారు. అవినీతి చేయకుంటే కేసీఆర్ సర్కార్ జీవో 51ను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని పేర్కొన్నారు.

చేనేత.. 5శాతం జీఎస్టీపై మంత్రులు  హరీష్, కేటీఆర్ లు దొంగ నాటకాలాడుతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఇతర పార్టీల ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం‌ వలనే.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో పునరావృతం అవుతాయన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం మునుగోడులో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ చేస్తున్న  గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు పాల్పడుతోందని ఆరోపించారు.  మునుగోడును కేటీఆర్ ఇప్పుడు దత్తత తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పోటీ కేవలం ఉనికి చాటుకోవడానికేనని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్‌  డూప్‌ ఫైట్‌ చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ  మురికిల పడ్డట్టే అన్నారు. 

నేడే ప్రచారం చివరి రోజు - అందరిలోనూ టెన్షన్ టెన్షన్

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం చివరి రోజున పలిమెల గ్రామంలో టీఆర్ఎస్,  బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  పలివెల గ్రామంలో బీజేపీ నేతల క్యాంప్ ఉన్న దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో.. బీజేపీ నేతలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎవరూ తగ్గలేదు. ఈ ఘర్షణ ముదిరి చివరికి దాడులకు కారణం అయింది.

ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు, వాహనాలపైనా  దాడులు చేశారు. ఇప్పుడు బీజేపీకి చెందిన వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజకీయ పార్టీలు సహనం కోల్పోతున్నాయని... పోలింగ్ రోజున మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈసీ చర్యలు తీసుకోనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget