అన్వేషించండి

BJP MP Laxman: ఎమ్మెల్యేలకు ఎరలో బీజేపీ పాత్ర లేదు‌‌, పార్టీకేం సంబంధం లేదు: ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందులో బీజేపీ పాత్ర ఎంత మాత్రమూ లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరమేది అధిష్టానమే నిర్ణయిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సహా.. ఏ పదవిని తాను ఆశించటం లేదని వివరించారు. గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు వస్తాయని... తాను పోటీ చేసేది లేనిదీ బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావించటం లేదన్నారు. అవినీతి చేయకుంటే కేసీఆర్ సర్కార్ జీవో 51ను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని పేర్కొన్నారు.

చేనేత.. 5శాతం జీఎస్టీపై మంత్రులు  హరీష్, కేటీఆర్ లు దొంగ నాటకాలాడుతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఇతర పార్టీల ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం‌ వలనే.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో పునరావృతం అవుతాయన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం మునుగోడులో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ చేస్తున్న  గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు పాల్పడుతోందని ఆరోపించారు.  మునుగోడును కేటీఆర్ ఇప్పుడు దత్తత తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పోటీ కేవలం ఉనికి చాటుకోవడానికేనని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్‌  డూప్‌ ఫైట్‌ చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ  మురికిల పడ్డట్టే అన్నారు. 

నేడే ప్రచారం చివరి రోజు - అందరిలోనూ టెన్షన్ టెన్షన్

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం చివరి రోజున పలిమెల గ్రామంలో టీఆర్ఎస్,  బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  పలివెల గ్రామంలో బీజేపీ నేతల క్యాంప్ ఉన్న దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో.. బీజేపీ నేతలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎవరూ తగ్గలేదు. ఈ ఘర్షణ ముదిరి చివరికి దాడులకు కారణం అయింది.

ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు, వాహనాలపైనా  దాడులు చేశారు. ఇప్పుడు బీజేపీకి చెందిన వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజకీయ పార్టీలు సహనం కోల్పోతున్నాయని... పోలింగ్ రోజున మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈసీ చర్యలు తీసుకోనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Rythu Bharosa Status: తెలంగాణలో రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి? ఆ తప్పులు చేస్తే పైసలు రానట్టే!
తెలంగాణలో రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి? ఆ తప్పులు చేస్తే పైసలు రానట్టే!
Komatireddy Rajgopal Reddy: మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?
మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NBK111 Glimpse : NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
Cricketer Bharti Fulmali : మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget