అన్వేషించండి

BJP MP Laxman: ఎమ్మెల్యేలకు ఎరలో బీజేపీ పాత్ర లేదు‌‌, పార్టీకేం సంబంధం లేదు: ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందులో బీజేపీ పాత్ర ఎంత మాత్రమూ లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 

BJP MP Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరమేది అధిష్టానమే నిర్ణయిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సహా.. ఏ పదవిని తాను ఆశించటం లేదని వివరించారు. గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు వస్తాయని... తాను పోటీ చేసేది లేనిదీ బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావించటం లేదన్నారు. అవినీతి చేయకుంటే కేసీఆర్ సర్కార్ జీవో 51ను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని పేర్కొన్నారు.

చేనేత.. 5శాతం జీఎస్టీపై మంత్రులు  హరీష్, కేటీఆర్ లు దొంగ నాటకాలాడుతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఇతర పార్టీల ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం‌ వలనే.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో పునరావృతం అవుతాయన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం మునుగోడులో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ చేస్తున్న  గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు పాల్పడుతోందని ఆరోపించారు.  మునుగోడును కేటీఆర్ ఇప్పుడు దత్తత తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పోటీ కేవలం ఉనికి చాటుకోవడానికేనని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్‌  డూప్‌ ఫైట్‌ చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ  మురికిల పడ్డట్టే అన్నారు. 

నేడే ప్రచారం చివరి రోజు - అందరిలోనూ టెన్షన్ టెన్షన్

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం చివరి రోజున పలిమెల గ్రామంలో టీఆర్ఎస్,  బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  పలివెల గ్రామంలో బీజేపీ నేతల క్యాంప్ ఉన్న దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో.. బీజేపీ నేతలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎవరూ తగ్గలేదు. ఈ ఘర్షణ ముదిరి చివరికి దాడులకు కారణం అయింది.

ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాలయాలు, వాహనాలపైనా  దాడులు చేశారు. ఇప్పుడు బీజేపీకి చెందిన వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజకీయ పార్టీలు సహనం కోల్పోతున్నాయని... పోలింగ్ రోజున మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈసీ చర్యలు తీసుకోనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget