అన్వేషించండి

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత కాలుకు ఫ్రాక్చర్ - మూడు వారాల బెడ్ రెస్ట్ !

ఎమ్మెల్సీ కవిత కాలుకు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.


MLC Kavitha :   తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలుకు  ఫ్రాక్చర్ అయినట్లుగా నిర్ధారణ కావడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కవిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నేరుగా కలవలేనని సోషల్ మీడియా ఖాతా ద్వారా సాయం అవసరం అయినవాళ్లు సంప్రదించవచ్చని తెలిపారు. 

 

 

గాయం ఎలా అయిందన్న  అంశాన్ని చెప్పని కవిత  

అయితే ఫ్రాక్చర్ అయ్యేంత గాయం ఎలా అయిందన్న విషయం మాత్రం కవిత సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించలేదు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి  మొదటి ఉద్యమంగా మహిళా రిజర్వేషన్ అంశాన్ని తీసుకున్నారు.  ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.   

భారత  జాగృతి పోరాటం మరికొంత ఆలస్యం                                  

తెలంగాణ జాగృతి కార్యాచరణలో భాగంగా మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. ఈ  నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు.  మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపనున్నారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండనే  విధంగా క్యాంపైన్  ప్రారంబించాలనుకున్నారు. అయితే ప్రస్తుతం  మూడు వారాల పాటు  బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ఈ ఉద్యమ కార్యాచరణ అంతా వాయిదా పడినట్లుగానే భావిస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడు వారాల పాటు ఈడీ విచారణ కూడా లేనట్లే ?                 

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా కవిత  విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె పలు మార్లు ఈడీ ఎదుట  హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన పది ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఈ పది ఫోన్ల విశ్లేషణ తర్వాత ఆమెను మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె గాయపడటంతో ఆ విచారణ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ విచారించదల్చుకుంటే ఈడీ అధికారులు ఇంటికే వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై విచారణ నెలాఖరులో జరగనుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget